రాయితీ రుణం.. మహిళలకు వరం
మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబానికి ఎంతో తోడ్పాటు లభిస్తుంది. సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది.
ఆహారోత్పత్తుల తయారీతో ఉపాధి
జిల్లాలో 379 మందికి అవకాశం
న్యూస్టుడే, చేగుంట
మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబానికి ఎంతో తోడ్పాటు లభిస్తుంది. సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. చాలామంది వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. 35 శాతం రాయితీతో డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వనున్నారు. బృందంగా కాకుండా వ్యక్తిగతంగానే అందించనున్నారు. వీటితో కేవలం ఆహార ఉత్పత్తులను మాత్రమే తయారు చేయాల్సి ఉంటుంది. డీఆర్డీఏ అధికారులు అన్ని మహిళా సంఘాల సభ్యులకు వీటి గురించి అవగాహన కల్పిస్తున్నారు. డబ్బులు ఇప్పిస్తామని చెబుతున్నా అవగాహనలేక చాలామంది ముందుకు రావడం లేదు.
ఒక్కొక్కరికి రూ.20 లక్షలు
ఒక్కో మహిళకు రూ.20 లక్షల వరకు ఇవ్వనున్నారు. జిల్లావ్యాప్తంగా 379 మందికి అందించే అవకాశముంది. ఒక మహిళ రూ.20 లక్షలు తీసుకుంటే అందులో రూ.7 లక్షల వరకు రాయితీ లభించనుంది. అలాగే ఆహార ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేస్తే మరి కొందరికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. 50 రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. బేకరి, బనానా చిప్స్, బిస్కెట్లు, బ్రెడ్స్, చిరుధాన్యాలు, చాక్లెట్లు, కొబ్బరిపొడి, కొబ్బరినూనె లాంటవి ఎన్నో తయారు చేయొచ్చు. దీనికిగాను తప్పకుండా ఐకేపీలో సభ్యురాలై ఉండాలి. డీఆర్డీఏ అధికారులే బ్యాంకు నుంచి రుణాలు ఇప్పిస్తారు.
* రాయితీ ఎక్కువగా ఉండటంతో మహిళలు ఉపాధి పొందేందుకు బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. అర్హత ఉన్న ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి పట్టునే ఉంటూ నచ్చిన యూనిట్ను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఐకేపీ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
-భీమయ్య, అదనపు డీఆర్డీవో
ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావాలి. రాయితీ ఎక్కువగా ఉన్నందున ఎంతో ప్రయోజనకారిగా ఉంది. ఇంటివద్దనే ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. దాదాపు అన్నింటికీ మార్కెటింగ్ సదుపాయం ఉంది. మహిళలు ముందుకొస్తే బ్యాంకర్లతో రుణాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు