11ఏళ్ల చిన్నారి అధ్యాయాల సాహస కథ
హాయ్ ఫ్రెండ్స్.. నా పేరు జి.అన్షిత. అమ్మానాన్నలు లావణ్య, భీమేశ్. ఇద్దరూ వైద్యులే. ఏడేళ్లున్న తమ్ముడు సంహిత్ ఉన్నాడు. సిద్దిపేటలోని ఆంబిటస్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నా.
పుస్తకం ఆవిష్కరణ
అడ్వెంచర్ ఆఫ్ రోజి అండ్ సెంటర్ పుస్తకం
న్యూస్టుడే, సిద్దిపేట: హాయ్ ఫ్రెండ్స్.. నా పేరు జి.అన్షిత. అమ్మానాన్నలు లావణ్య, భీమేశ్. ఇద్దరూ వైద్యులే. ఏడేళ్లున్న తమ్ముడు సంహిత్ ఉన్నాడు. సిద్దిపేటలోని ఆంబిటస్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నా. కథలు రాయడమంటే ఇష్టం. దీంతో నేనూ అటు వైపు అడుగేశా. నేను 2011 జూన్ 11న జన్మించాను. నేను రాసిన కథలో అధ్యాయాలు (ఛాప్టర్లు) కూడా 11. కథలో రోసి వయసు కూడా 11. నన్ను నేను రోసిలా ఊహించుకొని ‘ది అడ్వెంచర్ ఆఫ్ రోజి అండ్ సెంటర్’ పేరిట ఆంగ్ల భాషలో కథలు రాయడం (సిరీస్) మొదలెట్టా. ఇందులో మొదటిదే ‘ది అడ్వెంచరస్ దౌ ద ప్లానెట్ ఆఫ్ సర్కులస్’. 85 పేజీలు ఉంటాయి. దీన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సాహస కథలో ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి.
ఆరు నెలల కిందట..
పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఏదైనా సాధించవచ్చు. వివిధ రకాల కథలు, ఇతరత్రా పుస్తకాలు.. మూడో తరగతి నుంచే చదవడం ప్రారంభించా. తరచూ చదవడంతో రాసే శైలి అబ్బింది. నా వద్ద 50 వరకు పుస్తకాలు ఉన్నాయి. ఆరు నెలల కిందట స్వయంగా రాయడం మొదలెట్టా. సిరీస్లో భాగంగా మరిన్ని కథలు రాస్తా. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు కొంత సహకారం అందించారు. పాఠశాల నిర్వాహకుల సాయంతో పుస్తకాన్ని ప్రచురించాం. నాలుగో తరగతి నుంచే రెండు యూట్యూబ్ ఛానెళ్లు నిర్వహిస్తున్నా. బార్బీ డాల్స్తో పాటు సబ్జెక్టులు బోధిస్తూ వీడియోలుగా రూపొందించి ఛానెల్లో పోస్టు చేస్తున్నా. అన్నట్లు చదువులోనూ నేను ముందంజే.
కథలోకి వెళితే..
శాపానికి గురైన ఓ అందమైన పట్టణం నలుపు, తెలుపు రంగులకే పరిమితమవుతుంది. పట్టణానికి చెందిన సాహస బాలలు రోజి, సెంటర్.. శాప విముక్తి కల్పించాలని నిర్ణయించుకుంటారు. అందుకు స్థానిక గ్రంథాలయంలో వివిధ పుస్తకాలు తిరగేస్తారు. వండర్ విజార్డ్లో ‘సర్కులస్’ గ్రహం విశేషాలు చదువుతారు. అందులో విముక్తి మార్గం కనిపిస్తుంది. వెంటనే పుస్తకంతో సహా అక్కడికి చేరుకుంటారు. ఎంతో శ్రమించి రత్నాలు సేకరిస్తారు. చివరకు పుస్తకం సాయంతో ఇంటికి చేరుకుంటారు. రత్నాలను వృత్తాకారంలో అమర్చడంతో రంగులమయంగా మారడంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటారు. ఇలా కథ సుఖాంతమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా