సేవలు వృద్ధి.. ‘లక్ష్య’ సిద్ధి
ప్రసూతి, నవజాత శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతిష్ఠాత్మకంగా ‘లక్ష్య’ పురస్కారాలు ప్రధానం చేస్తోంది.
జహీరాబాద్ ఆసుపత్రికి దక్కిన పురస్కారం
నాణ్యతా ప్రమాణాల్లో రాష్ట్రంలో తొలి స్థానం
ఆసుపత్రిలో బాలింతల వార్డు
న్యూస్టుడే, జహీరాబాద్, అర్బన్: ప్రసూతి, నవజాత శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతిష్ఠాత్మకంగా ‘లక్ష్య’ పురస్కారాలు ప్రధానం చేస్తోంది. కాన్పు, బాలింతల వార్డుల్లో మెరుగైన వైద్యసేవలు సహా జాతీయ ఆరోగ్య మిషన్ మార్గదర్శకాల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించడం తప్పనిసరి. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వైద్య విధాన పరిషత్తు ప్రాంతీయ ఆసపత్రికి సదరు అవార్డు దక్కడం విశేషం. లక్ష్య కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న ఆసుపత్రిగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
అంతర్రాష్ట్ర సరిహద్దులో..
అంతర్రాష్ట్ర సరిహద్దు పట్టణమైన జహీరాబాద్లోని వంద పడకల ఆసుపత్రికి డివిజన్తో పాటు వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, బంట్వారం సహా కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు వైద్యానికి వస్తుంటారు. సాధారణ, ప్రసూతి సేవలు ఇక్కడి వైద్యులు చక్కగా అందిస్తున్నారు. నిత్యం వెయ్యి మంది ఔట్పేషంట్లు ఉంటుండగా, నెలలో 350 కాన్పులు జరుగుతున్నాయి. వీటిలో 70 శాతం వరకు సాధారణం కాగా, 30 శాతం లోపు శస్త్ర చికిత్స కాన్పులు చేస్తున్నారు.
మూడేళ్లు ప్రోత్సాహకాలు..
పురస్కారానికి ఎంపికైన ఆసుపత్రులకు జాతీయ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ సంయుక్తంగా మూడేళ్ల పాటు ప్రోత్సాహకాలు అందించనుంది. రూ.5 లక్ష చొప్పున మూడేళ్ల వరకు అందిస్తారు. ఈ నిధులను ప్రసూతి ఆపరేషన్ థియేటర్ ఆధునికీకరణకు కేటాయించడంతో పాటు వైద్యులు, సిబ్బంది పనితీరుకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తారు.
నవజాత శిశువును పరీక్షిస్తున్న వైద్యుడు శేషురావు
నిబంధనల మేర..
లక్ష్య పథకానికి సంబంధించి కేంద్రం పలు నిబంధనలు నిర్దేశించింది. ప్రసూతి గదిలో అన్ని సౌకర్యాలతో పాటు నవజాతి శిశువులకు చక్కని సేవలు అందించాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలి. ఆయా వాటి ప్రకారం మార్కులు కేటాయిస్తారు. గత జనవరి 20, 21వ తేదీల్లో కేంద్ర అధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ వైద్యుల బృందం ఆసుపత్రిని సందర్శించి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ప్రసూతి, నవజాత శిశు వైద్యసేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. జాతీయ స్థాయిలో నివేదిక సమర్పించడంతో పాటు స్కోరు కేటాయించారు. ఇందులో లేబర్ రూమ్ (ప్రసూతి) 94 శాతం, బాలింతలు, నవజాత శిశు వార్డుకు 95 శాతం స్కోర్ ఇవ్వడంతో జహీరాబాద్ ఆసుపత్రి రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది.
సమష్టి కృషికి గుర్తింపు
డా.శేషురావు, ఆసుపత్రి పర్యవేక్షకులు
వైద్యులు, సిబ్బంది సమష్టి కృషికి గుర్తింపుగా పురస్కారం దక్కింది. జాతీయ స్థాయి లక్ష్య పథకంలో రాష్ట్రంలో మొదటి స్థానం దక్కడం సంతోషంగా ఉంది. మరింత బాధ్యతగా మెరుగైన సేవలు అందిస్తాం.
పైసా ఖర్చులేకుండా..
స్వప్న, గర్భిణి, పీచేర్యాగడి
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. మొదటి కాన్పుకు ఇక్కడికే వచ్చాను మళ్లీ ఇప్పుడు రెండో సారి వచ్చాను. పైసా లేకుండా ప్రభుత్వం సేవలు అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM