తేలిన అంచనా.. సర్కారు కరుణించేనా!
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలకు నష్టమే మిగిలింది. సాధారణాన్ని మించి భారీ పరిమాణంలో వడగళ్లు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి.
సంగారెడ్డిలో అత్యధిక విస్తీర్ణంలో పంటలకు నష్టం
నాలుగు జిల్లాల్లోని 1,873 ఎకరాల్లో దెబ్బతిన్న మామిడితోటలు
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్టుడే, మెదక్
నందికందిలో రాలిన మామిడికాయలను చూపుతూ..
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలకు నష్టమే మిగిలింది. సాధారణాన్ని మించి భారీ పరిమాణంలో వడగళ్లు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్ల్లో కలిపి 1,873 ఎకరాల్లో మామిడికాయలు రాలాయి. వడగళ్ల వల్ల చెట్ల మీద ఉన్న కాయలూ పగిలిపోయాయి. వీటిని విక్రయించలేమని రైతులు ఆవేదనగా చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో..
క్షేత్రస్థాయిలో పర్యటించిన వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన అధికారులు సమగ్ర సమాచారాన్ని సేకరించారు. రైతులవారీగా ఎవరెవరు ఎంత నష్టపోయారనే వివరాలతో నివేదికలు సిద్ధం చేశారు. వాటిని ఉన్నతాధికారులకు అందిస్తున్నామన్నారు. వానల వల్ల నష్టపోయిన తమకు ఊరట దక్కేలా పరిహారమిచ్చి ఆదుకోవాలని బాధిత రైతులు ఆవేదనగా అడుగుతున్నారు. గతంలో చాలాసార్లు వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా ఒక్క రూపాయి కూడా తమకు పరిహారం అందలేదని వారు చెబుతున్నారు. ఈసారైనా ఇందుకు భిన్నంగా తమకు అండ నిలిచేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాము ప్రతిపాదనలు పంపిస్తున్నామని, తప్పక ఈసారి నష్టపరిహారం అందే అవకాశాలున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్నదాతలు అధైర్యపడొద్దంటున్నారు.
మొక్కజొన్న, జొన్న పంటలకే ఎక్కువగా
రాళ్లవాన ధాటికి మొక్కజొన్న, జొన్న పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. వాటి వెన్ను విరిగి పంట నేలవాలింది. దిగుబడులు వచ్చే అవకాశమే లేదని అన్నదాతలు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో మొక్కజొన్న 1,520 ఎకరాల్లో పాడైంది. వికారాబాద్ జిల్లాల్లో 1,468 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఏకంగా 2,286 ఎకరాల్లో జొన్న పంటపై అకాల వర్షాల ప్రభావం పడింది. మొక్కజొన్న పంట 1,058 ఎకరాల్లో దెబ్బతింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే