logo

ఈ ఏడాదంతా శుభమే

శోభకృత్‌ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభమే కలుగుతుందని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి అన్నారు.

Published : 22 Mar 2023 01:06 IST

పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్న మాధవానంద సరస్వతీస్వామి తదితరులు

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: శోభకృత్‌ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభమే కలుగుతుందని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి అన్నారు. నర్సాపూర్‌లో రుస్తుంపేటకు వెళ్లే మార్గంలో మల్లన్న గుడి నిర్మాణానికి మంగళవారం ఆయన స్థల పరిశీలనకు వచ్చారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్‌ డివిజన్‌ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకొని రూపొందించిన పంచాంగాన్ని ఆవిష్కరించారు. ప్రజలంతా భక్తిమార్గం అనుసరించాలన్నారు. నిత్యం దేవుణ్ని పూజించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. బ్రాహ్మణ సంఘం డివిజన్‌ అధ్యక్షుడు హరిప్రసాద్‌శర్మ, మాణిక్‌శర్మ, మురళీధర్‌శర్మ, హరికృష్ణశర్మ, నాయకులు మల్లేశ్‌యాదవ్‌, మణి, సిద్ధు, నిరంజన్‌, ప్రదీప్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని