రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో ఉత్కంఠ
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ఉత్కంఠకు దారి తీసింది. లబ్ధిదారుల ఎంపికకు అధికారులు 1550 మందితో జాబితాను సోమవారం విడుదల చేశారు.
అన్యాయం జరిగిందంటూ గజ్వేల్లో నిరసనలు
ఇళ్ల ఎంపికకు ఆడిటోరియంలో బారులు తీరిన దరఖాస్తుదారులు
గజ్వేల్ గ్రామీణ: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ఉత్కంఠకు దారి తీసింది. లబ్ధిదారుల ఎంపికకు అధికారులు 1550 మందితో జాబితాను సోమవారం విడుదల చేశారు. వారిలో 1100 మందికి కేటాయించడానికి గజ్వేల్ మహతి ఆడిటోరియంలో లాటరీ పద్ధతి ప్రక్రియ చేపట్టారు. దరఖాస్తుదారులు ఉదయం నుంచి ఆడిటోరియం వద్ద బారులు తీరారు. పేర్లు ఉన్నవారిని పోలీసులు లోపలికి అనుమతించారు. గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి, కౌన్సిలర్లు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జాబితాలో పేర్లు రాని వారిలో కొందరు అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. అనర్హులకు ఇస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ పునరుద్ధరించారు. లాటరీ పూర్తయ్యాక అందులో పేరు రాకపోవడంతో పలువురు యువకులు రహదారిపై హంగామా సృష్టించారు. యువకుడు ఒకరు పెట్రోలు పోసుకుంటానని బెదిరించడంతో పోలీసులు సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. డబ్బాలోని పెట్రోలును రోడ్డుపై పోసి నిప్పంటించగా ఆర్పేశారు. ఏసీపీ రమేశ్, సీఐలు వీరప్రసాద్, కమలాకర్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
దుబ్బాక తుది జాబితాలో తప్పులు!
దుబ్బాక: దుబ్బాక పురపాలికలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు సంబంధించి తుది జాబితాను అధికారులు మంగళవారం ప్రకటించారు. అనర్హులను ఎంపిక చేశారని, తప్పులతడకగా జాబితా ఉందని దరఖాస్తుదారులు ఆరోపించారు. 346 మంది లబ్ధిదారులను జాబితాలో పేర్కొన్నారు. కౌన్సిలర్లు పలువురు, పట్టణ భాజపా నాయకులు పోటాపోటీగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. క్రమ సంఖ్య 25, 87, 91, 267లో వచ్చిన పేర్లే, 285, 301, 319, 334లోనూ వచ్చాయని తెలిపారు. మరోసారి నిష్పక్షపాతంగా సర్వే చేయాలని కోరుతున్నారు. గతంలో విడుదలైన జాబితాల్లోనూ ఆరోపణలు రావడం గమనార్హం.
రహదారిపై నిప్పు పెట్టిన ఆందోళనకారుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM