logo

చౌటపల్లిని హుస్నాబాద్‌లో కలపాలని ఆందోళన

అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామాన్ని హుస్నాబాద్‌లో కలపాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. సర్పంచి గద్దల రమేశ్‌, ఉపసర్పంచి కొత్తకొండ పోశెట్టి, ఎంపీటీసీ సభ్యురాలు గంగాధరి సుగుణ భర్త రాజయ్యతో పాటు భారస గ్రామ అధ్యక్షుడు వెల్ది రంగారావును పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు.

Published : 22 Mar 2023 01:06 IST

నిర్బంధంలో సర్పంచి, ఉపసర్పంచి, ఎంపీటీసీ సభ్యురాలి భర్త

అక్కన్నపేట(హుస్నాబాద్‌ గ్రామీణం): అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామాన్ని హుస్నాబాద్‌లో కలపాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. సర్పంచి గద్దల రమేశ్‌, ఉపసర్పంచి కొత్తకొండ పోశెట్టి, ఎంపీటీసీ సభ్యురాలు గంగాధరి సుగుణ భర్త రాజయ్యతో పాటు భారస గ్రామ అధ్యక్షుడు వెల్ది రంగారావును పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. కార్యాలయం ముందు బైఠాయించారు. హుస్నాబాద్‌ మండలంలో చేర్చాలని గ్రామస్థులతో పాటు సర్పంచి, ఉపసర్పంచి, ఎంపీటీసీ సభ్యురాలు కోరారు.  ఈ నెల 20న అక్కన్నపేటలోని పది గ్రామాలను హుస్నాబాద్‌లో కలపాలని గెజిట్‌ విడుదలైంది. చౌటపల్లి పేరు లేకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ వివేక్‌, సిబ్బంది వచ్చి వారిని విడిపించారు.

* రామవరం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని అక్కన్నపేట మండలం కపూర్‌నాయక్‌తండా సర్పంచి బానోతు సంతోష్‌నాయక్‌ కోరారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన గ్రామసభలో మాట్లాడారు. అనంతరం తీర్మానించారు. ఈ ప్రతిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలనకు పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు