పోషకాహారం.. బాలలకు బలవర్ధకం
సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద విద్యార్థులే చదువుతుంటారు. పలువురు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాఠశాలలకు చేరుతుంటారు.
శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు సేవా నిరతి
న్యూస్టుడే, సిద్దిపేట
పాఠశాలల నిర్వాహకులకు పొట్లాలు ఇస్తున్న ప్రతినిధులు
సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద విద్యార్థులే చదువుతుంటారు. పలువురు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాఠశాలలకు చేరుతుంటారు. వేసవి లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆకలి మరింతగా ఉంటుంది. తద్వారా ఏకాగ్రత లోపించి చదువులపై ప్రభావం చూపుతుంది. ఈ తరుణంలో అలాంటి వారికెంతోమందికి శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు అండగా నిలుస్తోంది. ‘ఉదయపు పోషకాహార పానీయ’ సేవ ద్వారా బాలలకు ఉపకారం చేస్తుండటం విశేషం.
శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో 2019 నుంచి విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నెల రోజులుగా బెల్లంతో కూడిన రాగి పౌడర్ అందిస్తోంది. కాలాలతో సంబంధం లేకుండా వివిధ వర్గాలకు చెందిన ప్రజల క్షుద్బాధను తీరుస్తోంది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆహార, పానీయాలు అందించి అండగా నిలిచింది. ఈ క్రమంలో ఏళ్లుగా జిల్లాలో ఎంపిక చేసిన సర్కారు బడుల్లో అల్పాహారం అందజేస్తోంది. ఇటీవలి బెల్లంతో కూడిన రాగి పౌడర్ అందిస్తుండగా జావ తయారు చేసి ఇస్తున్నారు.
24 వేల మందికి..
సిద్దిపేట నియోజకవర్గంలోని పలు పాఠశాలలతో పాటు దౌల్తాబాద్, చేర్యాల, మర్కూక్, రాయపోల్ మండలాల్లోని అన్ని బడుల్లో పంపిణీ కొనసాగుతోంది. ఇలా 217 చోట్ల అందిస్తుండగా 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది. నిత్యం ఉదయాన్నే ప్రార్థనా సమయానికి ముందే జావ అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులతో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఇందుకు విద్యా శాఖ సహకారం తీసుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేసే యోచనలో ఉన్నారు.
అల్పాహారం
గతంలో జిల్లాలోని 41 పాఠశాలల్లో అల్పాహారం పంపిణీ చేశారు. అటుకులు, ఉప్మారవ్వ సహా కిచిడీ చేసేందుకు వీలుగా బియ్యం, పప్పులు, ఇతరత్రావి అందించారు. ఫిబ్రవరి ముగింపు వరకు ఆయా సరకులు అందించి మధ్యాహ్న భోజన కార్మికులతో వండించేవారు. 5 వేల మంది ఆకలి తీర్చారు. ఒకపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో ఫిబ్రవరితో తాత్కాలికంగా స్వస్తి పలికారు. ప్రస్తుతం అల్పాహారం బదులు రాగిజావ పంపిణీ చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం యథావిధిగా అల్పాహారం పథకాన్ని పునరుద్ధరించనున్నారు.
ప్రయోజనాలెన్నో..
ఉదయపు పోషకాహార పానీయంతో ప్రయోజనాలున్నాయి. జావ తయారీకి పంపిణీ చేసే మిశ్రమంలో రాగి, బెల్లం, సోయా, బియ్యం, దాల్చిన చెక్క, పసుపు, ఉప్పు తదితర వాటిని పొడిగా చేసి ‘సాయి ష్యూర్’ పేరిట అందిస్తున్నారు. వీటిలో కార్బొహైడ్రేట్స్, కాల్షియం, మెగ్నీషియం, వివిధ రకాల విటమిన్లు, ఫైబర్లు, ఐరన్ ఉన్నాయి. ఇవి విద్యార్థుల ఎదుగుదలకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రాగి జావ..
సేవాభావంతో..: మహదేవ్ నరేశ్ జిల్లా సమన్వయకర్త
ట్రస్టు నిరంతర సేవాభావంతో అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మంత్రి హరీశ్రావు, జిల్లా విద్యా శాఖ సహకారంతో సమర్థంగా ఉదయపు పోషకాహార పానీయ సేవ అమలు చేస్తున్నాం. కార్యక్రమ అమలుకు రంగధాంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం రాంప్రసాద్ సహకరిస్తున్నారు. విద్యార్థుల చదువు ఏకాగ్రతతో సాగేందుకు కార్యక్రమం దోహదం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తగతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
ద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!