logo

షడ్రుచుల సమ్మేళనంతో ఆనందమయం: మంత్రి హరీశ్‌రావు

ఉగాది పచ్చడి మాదిరి షడ్రుచుల సమ్మేళనంగా జీవితాన్ని ఆనందమయంగా ప్రజలంతా కొనసాగించాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

Published : 22 Mar 2023 01:06 IST

సిద్దిపేట, న్యూస్‌టుడే: ఉగాది పచ్చడి మాదిరి షడ్రుచుల సమ్మేళనంగా జీవితాన్ని ఆనందమయంగా ప్రజలంతా కొనసాగించాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శ్రీశోభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలిపారు. సిద్దిపేటలో మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. తెలుగు నూతన సంవత్సరాన్ని ఘనంగా నిర్వహించాలని, పండుగను ఆస్వాదించాలన్నారు. సంక్షేమ పథకాలు సాఫీగా ప్రజల దరి చేరుతున్నాయని, కాళేశ్వరం జలాలతో కాల్వలు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా చేరాయన్నారు. అందరికీ శుభం చేకూరాలని దేవుడిని ప్రార్థించినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని