నేర వార్తలు
సంగారెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. మంగళవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రిమాండ్ ఖైదీ పరార్
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: సంగారెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. మంగళవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్ర జైలు పర్యవేక్షకులు భరత్రెడ్డి, పట్టణ సీఐ శ్రీధర్రెడ్డి తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన చెద్రిక అరవింద్(22)పై సిద్దిపేట వన్టౌన్ స్టేషన్, సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూకట్పల్లి, కేపీహెచ్బీ, ఖమ్మం, పలు పోలీస్స్టేషన్లలో తొమ్మిది చోట్ల చోరీ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా జైలు నుంచి 50 రోజుల కిందట సంగారెడ్డి జిల్లా కంది కేంద్ర కారాగారానికి తరలించారు. ఆదివారం రాత్రి చిన్న ఇనుప చువ్వలు మింగడంతో అదే రాత్రి సంగారెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు ఆరోగ్యం కుదుటపడే వరకు ఉండాలని చెప్పడంతో, ఆయన వద్ద ముగ్గురు పోలీసులు కాపలా ఉన్నారు. సోమవారం రాత్రి సదరు ఖైదీ శౌచాలయానికి వెళ్లి వస్తానని చెప్పి, కిటికీ ఊచలు తొలగించి పారిపోయాడు. ఎంతకీ రాకపోవడంతో ఎస్కార్ట్ పోలీసులు ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. తోటి ఖైదీలు, జైలు సిబ్బందితో గొడవ పడేవాడని, అతడికి వివాహం కాలేదని, జల్సాల కోసం చోరీలకు పాల్పడటం అలవాటుగా చేసుకున్నాడని సీఐ వివరించారు.
ఆర్థిక ఇబ్బందులతో కూలీ ఆత్మహత్య
దుబ్బాక, న్యూస్టుడే: ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమై కూలీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ బత్తుల మహేందర్ వివరాలు తెలిపారు. ధర్మాజీపేట 9వ వార్డుకు చెందిన కొట్టె కనకయ్య (31) గంగిరెద్దుల వృత్తితో పాటు కూలీ పని చేస్తుంటాడు. అతడికి భార్య, పదేళ్ల వయసు లోపు ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆరు నెలల క్రితం ప్రభుత్వం అతనికి దుబ్బాక పట్టణంలో రెండు పడక గదుల ఇంటిని మంజూరు చేసింది. అక్కడే కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో కొంత కాలంగా చేయడానికి ఎలాంటి పని దొరకడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి ఇంట్లో అందరూ తిని పడుకున్నాక, మరో గదిలోకి వెళి,్ల ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు ఉదయం గుర్తించారు. భార్య దుర్గవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 9వ వార్డు కౌన్సిలర్ బత్తుల స్వామి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కారు ఢీ.. కార్మికుడి మృతి
జోగిపేట టౌన్, న్యూస్టుడే: కారుతో ఢీకొట్టడంతో కూలీ అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలం పరిధి ఎర్రారం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. జోగిపేట ఎస్సై సోమ్యానాయక్ తెలిపిన ప్రకారం. మధ్యప్రదేశ్కు చెందిన సునీల్కుమార్ జాతీయ రహదారి పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని గ్రామ శివారులో ఏర్పాటు చేసిన శిబిరానికి వెళుతుండగా, కోడేకల్ గ్రామానికి చెందిన గోవర్ధన్చారి కారులో వస్తూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై సునీల్కుమార్ దుర్మరణం పాలయ్యాడు. బాధితుడి అనిల్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
జడ్చర్ల గ్రామీణం, న్యూస్టుడే : పోలేపల్లి పారిశ్రామికవాడ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై లెనిన్ కథనం ప్రకారం.. పోలేపల్లి నుంచి గ్రీన్పార్కు(పారిశ్రామికవాడ)కు వెళ్లే రహదారిలోని కూడలిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులను కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావటంతో ద్విచక్రవాహనం నడుపుతున్న రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన దీపక్(23) మృతిచెందాడు. అతడు పోలేపల్లిలోని బంధువుల ఇంటి వద్ద ఉంటూ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. వెనక కూర్చున్న మిడ్జిల్ మండలం రాణిపేటకు చెందిన ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
పార్టీ శ్రేణులతో అభ్యర్థుల అంతర్గత సమావేశాలు -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!