ఆదర్శంగా తీర్చిదిద్దేలా.. ఆశయం నెరవేరేలా..
దేశం సాంకేతికపరంగా ఎంత అభ్యున్నతి సాధించినా, అత్యధిక జనాభా నివాసం ఉండేది ఇప్పటికీ గ్రామాల్లోనే. ఎంతమందికైనా ఇక్కడ ఉపాధికి కొరత ఉండదు.
పల్లెల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యాచరణ
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, మెదక్
గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న సిబ్బంది
దేశం సాంకేతికపరంగా ఎంత అభ్యున్నతి సాధించినా, అత్యధిక జనాభా నివాసం ఉండేది ఇప్పటికీ గ్రామాల్లోనే. ఎంతమందికైనా ఇక్కడ ఉపాధికి కొరత ఉండదు. జీవన వ్యయం తక్కువగా ఉండటంతో పేదలు పల్లెను వదిలేందుకు ఇష్టపడరు. అందుకే వీటిని ప్రగతి దిశగా అడుగులు వేయించాలన్న లక్ష్యంతో రూ.కోట్లలో నిధులు కేటాయిస్తోంది. అయినా సమగ్ర అభివృద్ధి కనిపించని పరిస్థితి. ఈ నేపథ్యంలో శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కథనం...
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ ఒక్కో మండలంలో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు, ఉపాధి క్షేత్రసహాయకులు ఇందులో పాల్గొనేలా చూస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధి సంగారెడ్డి, సిద్దిపేటలో ఇప్పటికే ప్రారంభించారు. సంగారెడ్డిలో ఏడు, సిద్దిపేటలో నాలుగు మండలాల్లో శిక్షణ పూర్తయింది. మెదక్, వికారాబాద్ జిల్లాల పరిధిలోని మండలాల్లోనూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నీటి పొదుపునకు..ఆర్ఆర్ఆర్
నీటి పొదుపుతోనే భవిష్యత్తు తరాలకు మనుగడ. దీన్ని దృష్టిలో ఉంచుకుని శిక్షణలో భాగంగా ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. నీటి వినియోగాన్ని తగ్గించడం(రెడ్యూస్), పునర్వినియోగం (రీయూజ్, భూమిలోకి ఇంకించడం(రీఛార్జి)పై శిక్షణ ఇస్తున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుకు ప్రణాళిక
గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ కీలకం. ఇది బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వీలుంటుంది. శిక్షణలో భాగంగా ఒకరోజు గ్రామ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ లోపాలను గుర్తించి పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనికి వీఎస్పీ (విలేజ్ శానిటేషన్ ప్లాన్)గా పేరు పెట్టారు.
ప్లాస్టిక్ నియంత్రణకు..
ప్లాస్టిక్ వినియోగంతో ఆరోగ్యానికి అనర్థమే. పర్యావరణానికి కూడా నష్టం. దీని నిషేధంపై ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రత్యామ్నాయంగా స్టీలును వినియోగించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని శిక్షణలో భాగంగా అవగాహన కల్పిస్తున్నారు. ఎంపికచేసిన పంచాయతీల్లో స్టీలు బ్యాంకులను కూడా ఏర్పాటు చేయిస్తున్నారు.
అందరూ బాధ్యతగా భావిస్తేనే..
- స్వామి, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా సమన్వయకర్త (సంగారెడ్డి)
అందరూ బాధ్యతగా భావిస్తేనే గ్రామాల అభ్యున్నతి సాధ్యం. శిక్షణతో మార్పునకు ప్రయత్నిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏడు మండలాల్లో పూర్తిచేశాం. మిగతా మండలాల్లోనూ షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగుతున్నాం. శౌచాలయానికి ఒక గుంత ఉంటే సరిపోదు, రెండు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.