ఆధార్ నవీకరించుకుందాం..
చదువు నుంచి ఉద్యోగాల వరకు ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రస్తుతం అందరి వద్ద ఈ కార్డు ఉంది. తాజాగా సవరణలకు దరఖాస్తు విధానాన్ని మార్పు చేసింది
న్యూస్టుడే, చేగుంట: చదువు నుంచి ఉద్యోగాల వరకు ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రస్తుతం అందరి వద్ద ఈ కార్డు ఉంది. తాజాగా సవరణలకు దరఖాస్తు విధానాన్ని మార్పు చేసింది. పదేళ్లు దాటిన వారు కార్డును నవీకరణ చేసుకోవాలని పాలనాధికారి రాజర్షిషా సూచించారు. వీటిని కామన్ సర్వీస్ కేంద్రాలతో పాటు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, బీఎస్ఎన్ఎల్ కేంద్రాలతో పాటు ఆధార్ కేంద్రాల్లో ఉచితంగా సేవలు పొందవచ్చు. అంగన్వాడీ పర్యవేక్షకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 469 పంచాయతీలతో పాటు మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ పురపాలికల్లో నవీకరణ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది.
పేరు సవరించాలంటే..
ఫొటోతో ఉన్న ధ్రువపత్రాన్ని తప్పని సరిగా పొందుపర్చాలి. పదో తరగతి మార్కుల మెమో, పాన్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, ఉపాధి జాబ్కార్డు, సదరం ధ్రువీకరణ పత్రాల్లో ఏదైన ఒకదానిని జతచేయాలి. ఉద్యోగులు వారి గుర్తింపు కార్డు, వివాహితులైతే ఉప రిజిస్ట్రారు కార్యాలయం జారీ చేసే ధ్రువపత్రం, తహసీల్దారు ఇచ్చే కుల ధ్రువపత్రాలను సమర్పించాలి.
పుట్టినతేదీ మార్పునకు..
గతంలో పుట్టిన తేది మార్చుకునేందుకు నమూనా పత్రాన్ని భర్తీ చేసి గెజిటెడ్ అధికారి సంతకం చేయిస్తే సరిపోయేది. పాన్కార్డులో ఉన్న తేదీని అధికారికంగా ధ్రువీకరించుకునే వీలు ఉండేది. చిన్నారులకైతే తప్పనిసరిగా పురపాలిక, పంచాయతీలు జారీ చేసే ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఇది కూడా ఒకసారి మాత్రమే సవరించుకోవచ్చు. రెండో సారి మార్పు చేసుకోవాలంటే రాజధాని కార్యాలయానికి వెళ్లి తగిన వివరణ ఇస్తూ ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
లింగమార్పిడి..
జెండర్ విషయంలో సవరణకు ఒకసారి మాత్రమే అవకాశం కల్పించారు. ఇందుకుగాను తప్పకుండా అర్హతగల గుర్తింపుపత్రాన్ని జతచేయాలి. మరో సారి చేయాలంటే ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిందే. ఇందుకు చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
వయసుల వారీగా
కొత్తగా సవరణకు మూడు కేటగిరీలుగా విభజించారు. అయిదేళ్లలోపు చిన్నారులను మొదటి, 5-18 ఏళ్లలోపు రెండు, 18 ఏళ్లు పైబడినవారిని మూడో కేటగిరీగా చేసి, మూడు దరఖాస్తులను ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!