రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
సిద్దిపేట జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఉగాది పండుగ రోజు ఈ ఘటనలు చోటుచేసుకోవడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది.
పండుగ పూట విషాదం
సిద్దిపేట అర్బన్, కొండపాక, న్యూస్టుడే: సిద్దిపేట జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఉగాది పండుగ రోజు ఈ ఘటనలు చోటుచేసుకోవడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. సిద్దిపేట గ్రామీణ ఠాణా ఎస్ఐ కిరణ్రెడ్డి తెలిపిన వివరాలు.. దుబ్బాక మండలం చేర్వాపూర్కు చెందిన చిట్టిపాక విజయ్కుమార్(23), స్నేహితుడైన బదనకంటి రఘు(25) సిద్దిపేటలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం కూలీ పనులు ముగించుకొని ఇంటికి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్నారు. ఇర్కోడు శివారులోకి రాగానే దుబ్బాక నుంచి సిద్దిపేట వైపు వస్తున్న బొలేరో వాహనం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రఘును 108 వాహనంలో సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. విజయ్కుమార్కు భార్య మమత, ఐదు నెలల కుమార్తె ఉంది. రఘుకు దుబ్బాక మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన సింగోజి ఆంజనేయులు(60) మంగళవారం హైదరాబాద్కు వెళ్లి తిరిగి రాత్రి బస్సులో ప్రయాణమై కొమురవెల్లి కమాన్ వద్ద దిగాడు. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఆంజనేయులును బలంగా ఢీకొనడంతో అపస్మారకస్థితికి చేరాడు. వాహనంపై ఉన్న విశ్వనాథపల్లికి చెందిన గుల్ల బాబుకు తీవ్రగాయాలయ్యాయి. మరో బస్సులోని ప్రయాణికుడు 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. క్షతగాత్రులను ములుగు ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందాడు. అతడికి భార్య, ఐదుగురు కుమారులున్నారు. కుమారుడు భాస్కర్ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ పుష్పరాజ్ కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తగతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
ద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!