పక్కా ప్రణాళికతోనే దారి దోపిడీ
తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని వాహనం డ్రైవర్కు వచ్చిన దురాశ వల్లే, పక్కా ప్రణాళికతో తాట్పల్లి శివారులో దారి దోపిడీకి పాల్పడ్డారని, నిందితులంతా 30 ఏళ్ల వయస్సులోపు వారేననని మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జీ తెలిపారు.
డ్రైవర్ దురాశే నేరానికి కారణం
కేసు వివరాలు వెల్లడించిన మెదక్ డీఎస్పీ, సీఐ
వివరాలు తెలుపుతున్న మెదక్ డీఏస్పీ సైదులు, సీఐ జార్జి
రేగోడ్, న్యూస్టుడే: తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని వాహనం డ్రైవర్కు వచ్చిన దురాశ వల్లే, పక్కా ప్రణాళికతో తాట్పల్లి శివారులో దారి దోపిడీకి పాల్పడ్డారని, నిందితులంతా 30 ఏళ్ల వయస్సులోపు వారేననని మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జీ తెలిపారు. రేగోడ్ ఠాణాలో బుధవారం సమావేశం నిర్వహించి సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం రాజన్నపేట వీధిలో రవికిరణ్ కిరాణం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఐటీసీ కంపెనీకి చెందిన ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లోని దుకాణాలకు తరలించేందుకు డ్రైవర్ మహమ్మద్ అహ్మద్ను నియమించుకుని నెలకు రూ.16,500 వేతనం ఇస్తున్నాడు. ఇదే క్రమంలో ఈనెల 20వ తేదీన ఎప్పటిలాగే వాహనాన్ని తీసుకెళ్లి సామగ్రి సరఫరా చేశారు. అనంతరం జహీరాబాద్కు వెళ్లే క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా, ముందే అనుకున్న ప్రకారం పథకాన్ని అమలు చేసి మరికొందరితో కలిసి తాట్పల్లి శివారులో దోపిడీ చేశారు.
ఎక్కువ డబ్బులు సంపాదించాలని..: కుటుంబ పోషణకు ప్రస్తుతం వస్తున్న వేతనం సరిపోవడం లేదని, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేందుకు ప్రణాళిక వేస్తున్నానని, సహకరించాలని మిత్రుడు అన్వర్ను అహ్మద్ కోరడంతో, డబ్బులకు ఆశపడి అంగీకరించాడు. అయితే మరికొంత మంది సహాయం కావాలని మీర్జా కసిఫ్కు విషయం తెలిపాడు. అతనికి పరిచయం ఉన్న 8మందికి డబ్బుల ఆశ చూపి ఒప్పించారు. వీరంతా 20వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనైనా తమ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. డ్రైవర్ అహ్మద్ ఎప్పటిలాగే వస్తువులను వాహనంలో వేసుకున్నాడు. బయలుదేరే విషయాన్ని అన్వర్కు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చాడు. ఇలా అందరూ జహీరాబాద్ శివారులో కలుసుకుని, కట్టెలు, కారంపొడి, కత్తి సిద్ధం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో వస్తువులను సరఫరా చేశాక, డబ్బులతో తిరిగి వస్తుండగా, సైఫ్ఖాన్, మస్తాన్, చోట హర్షద్, బడా హర్షద్, బుర్హన్, మంజూర్, జమీర్, సుఫీయాన్ బృందాలుగా విడిపోయి తాట్పల్లి శివారులోకి వాహనం రాగానే అడ్డగించారు. డ్రైవర్ అహ్మద్తో పాటు వాహనంలో ఉన్న శ్రీకాంత్, సుధాకర్లపై దాడి చేసి బెదిరించారు. వారి వద్ద నగదు సంచి, రెండు చరవాణులు, వాహనం తాళాలు లాక్కెళ్లారు. రూ.7,46,411ను పంచుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. రాయిపల్లి కూడలి వద్ద నిందితులు ఉన్నట్లు బుధవారం సమాచారం అందడంతో 11 మందిని అరెస్టు చేశాం. వారి నుంచి రూ.6.70 లక్షలు, కత్తి స్వాధీనం చేసుకుని, మెదక్ కోర్టుకు రిమాండ్ చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్