యంత్రం పక్కకుపెట్టి.. హాజరు గుప్పిటపట్టి!
పురపాలికల్లో పొరుగు సేవల పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల హాజరు విషయంలో కొందరు పర్యవేక్షకులు అక్రమాలకు పాల్పడుతున్నారు.
పురపాలికల్లో దందాలకు తెరలేపిన పర్యవేక్షకులు
ఈనాడు, సంగారెడ్డి
సంగారెడ్డి పురపాలికలో ఇటీవల పొరుగు సేవల సిబ్బంది ధ్రువపత్రాలు పరిశీలించిన అధికారులు
పురపాలికల్లో పొరుగు సేవల పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల హాజరు విషయంలో కొందరు పర్యవేక్షకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. బయో మెట్రిక్ యంత్రాలు పక్కకుపెట్టి తమకు నచ్చిన వారి పేర్లు రిజిస్టర్లలో రాసేసి వంద శాతం హాజరు వేస్తున్నారు. వారు క్షేత్రస్థాయిలో పనిచేయకపోయినా జీతాలిస్తూ ఆ సొమ్మును జేబుల్లోకి వేసుకుంటున్నారు. పేర్లు ఒకరివి రాసి, పని మరొకరి చేత చేయిస్తూ కమీషన్లు దండుకొంటున్నారు. సంగారెడ్డి పురపాలికలో జరుగుతున్న ఈ దందా బహిరంగ విచారణలో వాస్తవమని వెల్లడైంది. సాక్షాత్తూ పురపాలిక అధ్యక్షురాలి బంధువులు ఆరుగురు పనిచేస్తున్నట్లు వెలుగు చూసింది. పూర్తి వివరాలు సేకరించాక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇతర పురపాలికల్లో పరిశీలించగా.. బయోమెట్రిక్ యంత్రాలు అటకెక్కించినట్లు తేలింది.
365 రోజులూ పనిచేశారట
పారిశుద్ధ్య నిర్వహణ, వాటర్ వర్స్క్, రెవెన్యూ తదితర విభాగాల్లో పొరుగు సేవల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉదయం బయోమెట్రిక్ యంత్రాలతో వీరి హాజరు తీసుకొనేవారు. కరోనా సమయంలో యంత్రాలను తాత్కాలికంగా పక్కకు పెట్టగా, ఆ తర్వాత పూర్తిగా మూలకు పడేశారు. సంగారెడ్డి పురపాలికలోని వాటర్ వర్స్క్ విభాగంలో 24 మంది పనిచేస్తున్నారు. గత ఏడాది కాలంగా వీరంతా ఒక్కటంటే ఒక్క సెలవు పెట్టకుండా విధులకు హాజరైనట్లు చూపారు. హాజరు పట్టికను ఇటీవలే సిద్ధం చేయడం గమనార్హం. పరిశీలిస్తే మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇలాంటివి వెలుగుచూస్తాయి.
పనితీరుపై ప్రభావం: పురపాలికల్లో సమయానికి నీళ్లు రావాలన్నా, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలన్నా, పార్కులు ఆహ్లాదం పంచాలన్నా పొరుగు సేవల సిబ్బందే కీలకం. సిబ్బందిలో కొందరు విధులకు హాజరుకాకుండానే, పర్యవేక్షకులతో కలిసి జీతాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అన్ని పురపాలిక కార్యాలయాల్లో బయోమెట్రిక్ యంత్రాలు వాడుతుండగా, క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు తీసుకొనేందుకు మాత్రం వాడడంలేదు. కొన్ని చోట్ల కొద్దిమందికే పరిమితం చేస్తున్నారు. జహీరాబాద్లో పారిశుద్ధ్య విభాగంలోని 150 మంది హాజరుకు బయోమెట్రిక్ వాడుతున్నారు. మిగతా విభాగాల్లో పనిచేసే 72 మందికి రిజిస్టర్లను వినియోగిస్తున్నారు. జోగిపేట పురపాలికలో మొక్కుబడిగా వాడుతున్నారు.
గతంలోనూ ఆరోపణలు
పురపాలికల్లో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద పనిచేయడానికే కొందరు సిబ్బందిని నియమించుకున్నారు. జహీరాబాద్, సంగారెడ్డి పురపాలికల్లో గతంలోనూ ఇలాంటివి వెలుగు చూశాయి. బయోమెట్రిక్ యంత్రాలున్నప్పుడు ఈ అక్రమాలు కొంత మేర తగ్గాయి. ఇప్పుడు అటకెక్కడంతో పర్యవేక్షకులే మళ్లీ అక్రమాలకు తెరలేపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు