చిత్తశుద్ధి లేని బల్దియా
అభివృద్ధి కార్యక్రమాలు సమయానికి పూర్తవ్వాలంటే నిధులు అవసరం. హుస్నాబాద్ బల్దియాలో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నా పాలకవర్గం పట్టించుకోవటం లేదు.
న్యూస్టుడే, హుస్నాబాద్
హుస్నాబాద్ పురపాలక సంఘం
అభివృద్ధి కార్యక్రమాలు సమయానికి పూర్తవ్వాలంటే నిధులు అవసరం. హుస్నాబాద్ బల్దియాలో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నా పాలకవర్గం పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ పరంగా వచ్చే వివిధ గ్రాంట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పుర సాధారణ నిధి నుంచి పారిశుద్ద్య ఉద్యోగుల వేతనాలు, వీధి దీపాలు, నీటి సరఫరా నిర్వహణ, విద్యుత్తు బిల్లులకు సరిపోవడం లేదు. ఒక్కోసారి వేతనాలు ఇవ్వడానికి సాధారణ నిధిలో సరైన నిల్వలు లేక ఇతర గ్రాంట్ల నుంచి మళ్లిస్తున్నారు. ఆస్తి పన్నులు, వ్యాపార లైసెన్సులు, ఇంటి నిర్మాణ అనుమతి రుసుములు, అంగడి వేలం తదితరాల ద్వారా ఏటా రూ.2.50 కోట్ల ఆదాయం వస్తోంది. పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే రూ.3 కోట్లకుపైగా చేరుకునే అవకాశం ఉంది. కొందరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నా ఆస్తి పన్ను విధింపు ప్రారంభం కాలేదు. వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పట్టణంలో దాదాపు 800 పైగా వ్యాపార దుకాణాలు ఉన్నాయి. వాటిలో యాభై శాతానికి పైగా వృత్తి వ్యాపార లైసెన్సులు లేవు. కేవలం బ్యాంకు రుణాలు, ఇతర వాణిజ్య పన్నుల ధ్రువీకరణ పత్రాలు పొందడానికి అవసరం ఉన్న వారే లైసెన్సులు తీసుకుంటున్నారు.
ఇష్టారాజ్యంగా ప్రచార బోర్డులు
గత రెండేళ్లుగా పురపాలిక పరిధిలో వివిధ రకాల షాపింగ్ మాల్స్, దుస్తుల దుకాణాలు, రెస్టారెంట్లు, బేకరీలు, ఆటోమొబైల్స్ ఏర్పాటు అయ్యాయి. వాస్తవానికి పురపాలిక నుంచి ట్రేడ్ లైసెన్సు పొందిన తర్వాతనే ప్రారంభించాలి. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం లేదు. పట్టణంలో మాంసం, చికెన్ సెంటర్లు దాదాపు 80 ఉన్నాయి. ఇందులో 70 శాతం వాటికి అనుమతుల్లేవు. అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మాంసం దుకాణాల నుంచి ప్రతిరోజు పశు వధశాల రుసుము వసూలు చేయాలి. పశువధశాల ఏర్పాటు చేయడంలో పాలకవర్గం నిర్లక్ష్యం వహిస్తోంది. పురపాలికకు ఆదాయంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన మాంసం లభించే అవకాశం ఉంది. ఇటీవల ప్రతి శుక్రవారం జరిగే అంగడి వేలం రూ.కోటి వరకు రావాల్సి ఉండగా రూ.80 లక్షలకే పరిమితమైంది. వేలంలో పోటీ పెరిగితే మరో రూ.20 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణంలో హోర్డింగులు, డివైడర్లపై ఉండే స్తంభాలు ప్రచార బోర్డులపై అన్నిటికీ రుసుము వసూలు చేయాల్సి ఉంది. ఇష్టారాజ్యంగా ఏర్పాటవుతున్నాయి. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఖాళీగా ఉన్నవాటిపై సెస్సు వసూలు చేసే అవకాశం ఉన్నా చేయడం లేదు. రెండేళ్ల క్రితం పలు చోట్ల ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగగా తొలగించారు. సెల్ టవర్లకు సంబంధించి రుసుము వసూలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. దాదాపు 25 పైగా టవర్లు ఉన్నాయి. పలు ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తే పురపాలికకు మరో రూ.50 లక్షలకు పైగా ఆదాయం చేకూరనుంది.
దృష్టి పెట్టి, తాఖీదులిస్తాం: - రాజమల్లయ్య, కమిషనర్, పురపాలక సంఘం, హుస్నాబాద్
వివిధ రకాల లైసన్సుల జారీ, రుసుము వసూళ్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ట్రేడ్ లైసన్సుల జారీకి కొత్త విధానం వచ్చింది. విస్తీర్ణాన్ని బట్టి నిర్ణయిస్తాం. టవర్లకు సంబంధించి తాఖీదులు జారీ చేస్తాం. బల్దియా ఆదాయాన్ని మరింత సమకూర్చుకొని అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్