అమ్ముకునేందుకు అవస్థ!
శనగలు పండించిన రైతులు వాటిని అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. నాఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వెళుతున్నా ఇబ్బందులు తప్పడం లేదు.
శనగల కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి దయనీయం
వారాలు గడుస్తున్నా అందని బిల్లులు
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్టుడే, జహీరాబాద్ అర్బన్, సిర్గాపూర్, మనూరు
శనగలు పండించిన రైతులు వాటిని అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. నాఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వెళుతున్నా ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని కేంద్రాల్లో తమ వంతు కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. టోకెన్లు సంపాదించి చివరకు అమ్ముకున్నా వారాలు గడిచినా నగదు ఖాతాల్లో జమకాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నాఫెడ్ నిధులు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. సదాశివపేట, జహీరాబాద్, సిర్గాపూర్, మనూరు మండలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఇదే విషయం వెలుగులోకి వచ్చింది.
రేపు.. మాపంటూ జాప్యం
సిర్గాపూర్ మండలంలోని బొక్కస్గావ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కేంద్రమిది. ఈ మండలంతో పాటు కల్హేర్, కంగ్టి మండలాల్లో శనగలు పండించిన రైతులు విక్రయించుకునేందుకు వీలుగా ఇక్కడ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపు మాపంటూ జాప్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ కొనుగోళ్లు మొదలవలేదు. రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయస్తున్నారు.
తరలింపులో నిర్లక్ష్యం
సదాశివపేటలోని కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 350 క్వింటాళ్లు కొన్నారు. పదిరోజుల క్రితం ఇందులో 250క్వింటాళ్లు గోదాముకు తరలించారు. ఇంకా 100 క్వింటాళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇవి గోదాముకు వెళితేనే ఆయా రైతుల పేరిట బిల్లు నమోదు చేస్తారు. గోదాములకు పంపిన తర్వాత నాణ్యత బాగా లేదని కూడా తిప్పి పంపుతున్నారని నిర్వాహకులు వివరించారు. కనీసం నెలరోజులు గడిస్తేనేగానీ అమ్మిన శనగల డబ్బులు ఖాతాల్లో జమయ్యేలా లేవని రైతులు నిరాశగా చెబుతున్నారు.
మధ్యాహ్నమైనా తెరచుకోలేదు
మనూరు మండలంలోని శనగల కొనుగోలు కేంద్రమిది. ఇక్కడ ఇప్పటి వరకు 161 మంది రైతుల నుంచి 2,233 క్వింటాళ్లు కొన్నట్లు మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కేంద్రాన్ని ఇష్టానుసారం నిర్వహిస్తుండటంతో విక్రయించేందుకు ఇక్కడకు వస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. గురువారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో వెళ్లి చూడగా ఇంకా గేటు మూసేసే ఉంది. ఇదే విషయమై అక్కడి నిర్వాహకులను అడగ్గా.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తెరిచామని సమాధానమిచ్చారు.
హమాలీల కొరత.. తప్పని నిరీక్షణ
జహీరాబాద్లో గతనెల 23 నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. ఇక్కడకు శనగలను తీసుకొచ్చిన రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. హమాలీల కొరత సాకుగా చూపుతున్నారు. త్వరగా తూకం వేయాలంటే బస్తాకు రూ.10 నుంచి రూ.15 వరకు అదనంగా ఇచ్చుకోక తప్పడం లేదని కొందరు వివరించారు. టోకెన్లు జారీ చేసే సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు. తాను టోకెన్ల కోసం మూడు రోజులుగా వచ్చిపోతూనే ఉన్నానని పోతిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాస్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహీర్లో యువకుడి దారుణ హత్య
[ 23-04-2024]
కోహీర్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి దాటాక దాడి చేసి హత్య చేశారు. -
మెదక్ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?
[ 23-04-2024]
అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
[ 23-04-2024]
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
కాంగ్రెస్ది అవినీతి, కుటుంబ పాలన
[ 23-04-2024]
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఏడు నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి సోమవారం ఏడుగురు నామినేషన్లు వేశారు. తెలంగాణ రాజ్య సమితి నుంచి తుపాకుల మురళీకాంత్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మైసన్గారి సునీల్ నామపత్రాలను దాఖలు చేశారు. -
భాజపా దుష్ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 23-04-2024]
భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో భాజపా సాగిస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, గోబెల్ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
చితికిపోతున్న.. చిరు వ్యాపారులు
[ 23-04-2024]
జిల్లాలోని పురపాలికల్లో వీధి వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణం ప్రతిపాదనల దశ దాటడం లేదు. మెదక్లో నిర్మాణం చేపట్టినా ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. -
విజ్ఞాన నేస్తం.. మార్గదర్శనం
[ 23-04-2024]
పుస్తకం.. సమస్త విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. మనిషిని మనీషిగా మార్చేందుకు బాటలు వేస్తుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అంటూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. -
అటు ఇటు మారి.. భువనగిరిలో చేరి..
[ 23-04-2024]
పార్లమెంట్ నియోజకవర్గాలు ఆవిర్భావమై దాదాపు ఏడు దశాబ్దాలు కాగా ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాలకు మారడం గమనార్హం. పునర్విభజన జరిగినప్పుడల్లా పార్లమెంటరీ నియోజకవర్గం మారింది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు ఇదే తేడా..
[ 23-04-2024]
ఎలక్టాన్రిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబరు దీనిపై కనిపిస్తాయి. అది కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది. -
లంచం కేసులో ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 23-04-2024]
లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రజాచైతన్యంలో గ్రంథాలయాలు కీలకం
[ 23-04-2024]
ప్రజాచైతన్యానికి ఆ నాటి గ్రంథాలయాలు కీలకంగా పనిచేశాయని.. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తనాన్ని మట్టుబెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆచార్య కోదండరామ్ అన్నారు. -
ఓటర్లకు చేరువ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
పురపాలికల్లో పట్టు.. విజయానికి మెట్టు
[ 23-04-2024]
మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకొంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. -
ఈసారి అవకాశం ఇవ్వండి
[ 23-04-2024]
భారాస అభ్యర్థి వినోద్కుమార్, భాజపా అభ్యర్థి బండి సంజయ్లను ఒక్కోసారి గెలిపించిన కరీంనగర్ లోక్సభ ఓటర్లు, ఈసారి తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసిన వెలిచాల రాజేందర్రావు కోరారు. -
విత్తనోత్పత్తికి అనుకూలం.. ప్రోత్సహించాల్సిన అవసరం
[ 23-04-2024]
వ్యవసాయంలో కీలకమైన విత్తనాలను కర్షకులు సేకరించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడి భూముల్లో విత్తితే చివరికి పంట ఎదుగుతుందో లేదోననే అనుమానం.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!