పాత నీటి పథకాలే దిక్కు
మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో కొన్నిచోట్ల సాధ్యం కావడం లేదు.
పూర్తి స్థాయిలో సరఫరా కాని ‘మిషన్ భగీరథ’
పంచాయతీలకు తప్పని విద్యుత్తు బిల్లుల భారం
- హుస్నాబాద్ గ్రామీణం, సిద్దిపేట, మద్దూరు, నంగునూరు - న్యూస్టుడే
హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లో సింగిల్ఫేజ్ బోరుమోటారు నీటిని పట్టుకుంటున్న మహిళ
మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో కొన్నిచోట్ల సాధ్యం కావడం లేదు. కొన్ని గ్రామాల్లో సమస్యలు వేధిస్తున్నాయి. ఇంట్రా, గ్రిడ్ సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. లీకేజీలు, మరమ్మతుల పేరిట రెండు మూడు రోజులకోసారి నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. సరఫరా జరగని గ్రామాల్లో పాత రక్షిత మంచినీటి పథకాలే దిక్కవుతున్నాయి. భగీరథ నీటితో పాటు బావులు, బోర్ల నుంచి ట్యాంకు నింపి సరఫరా చేస్తున్నారు. పాత పథకాల ద్వారా సరఫరా చేస్తే విద్యుత్తు బిల్లులు తడిసి మోపెడవుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. గుత్తేదారు పనులు నాణ్యంగా లేకపోవడంతో ట్యాంకు కారుతోంది. గేట్వాల్వులు సరిగా లేక రోడ్లన్నీ నీటితో నిండుతున్నాయి. ఇంటింటికీ పూర్తిస్థాయి నీరు రావటం లేదు. గ్రామానికి రెండు రక్షిత మంచినీటి బావులు, 2 త్రీఫేజ్ బోరు మోటార్లు, 18 సింగిల్ ఫేజ్వి ఉన్నాయి. పంచాయతీకి వచ్చే నిధులు విద్యుత్తు బిల్లులకే సరిపోతున్నాయని సర్పంచి బత్తిని సాయిలు తెలిపారు. నెలకు రూ.60 వేలు వస్తోందన్నారు. బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భల్లునాయక్తండా సర్పంచి ఇస్లావత్ రజిత కోరుతున్నారు. వంగరామయ్యపల్లిలో, వడ్డెర కాలనీలో సరిపోయేన్ని రావటం లేదని సర్పంచి విజయలక్ష్మి కోరారు.
ఎత్తుకు చేరలేని పరిస్థితి
అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామం చాలా ఎత్తులో ఉంది. ఇక్కడ రెండు ట్యాంకులు, గ్రామ పరిధిలోని బోరింగ్తండా, అంబబాయితండా, శ్రీరాంతండాలోనూ నిర్మించారు. వీటిలో నీటిని ఎక్కించేందుకు ఒత్తిడి పెంచితే పైపులైన్లు పగిలిపోతున్నాయి. గొట్టాలు భూమిలో వేసేటపుడు లెవల్ సరిగా చూడకపోవటంతో సమస్య తలెత్తుతోంది. ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. కట్కూర్లో ఎప్పుడు నీరు వస్తుందో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి నెలకొంది. కుందన్వానిపల్లి, అంతకపేటలో కనెక్షన్లు ఇవ్వలేదు. మల్లంపల్లిలోని రెండు ట్యాంకుల్లో ఒక్కదానికే ఎక్కుతున్నాయి. ధూల్మిట్ట మండలం దుబ్బతండాకు మిషన్ భగీరథ నీరు అందడం లేదు. ట్యాంకును ఎత్తులో నిర్మించడంతో ఎక్కటం లేదు. వ్యవసాయ బోర్ల వద్ద నుంచి బిందెలతో తెచ్చుకుంటున్నారు. నంగునూరు మండలం దర్గపల్లిలో ట్యాంకు మెట్లు కూలిపోయాయి. దానిని శుభ్రం చేయక పోవడంతో నీరు కలుషితంగా వస్తున్నాయి. వాటిని గ్రామస్థులు వినియోగించడం లేదు. అక్కెనపల్లిలో రెండు పడకగదుల ఇళ్ల సముదాయానికి ట్యాంకు ఉన్నా నీరు రావటం లేదు.
ఎస్సీ కాలనీలో మినీ వాటర్ ట్యాంక్
ఆపరేటర్లకు అవగాహన కల్పించి పరిష్కరిస్తాం
కొన్ని చోట్ల సమస్య ఉంది. కొన్ని ట్యాంకులకు ఔట్లెట్ కనెక్షన్లు ఇవ్వలేదు. కొన్ని ఎత్తులో ఉన్నాయి. ఆపరేటర్లకు సరైన అవగాహన లేక నీటి సరఫరాలో సమస్య వస్తోంది. రెండు మూడు రోజుల్లో వారితో సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తాం. ప్రతి రోజూ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
బాలరాజు, మిషన్ భగీరథ డీఈఈ (గ్రిడ్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!