పరస్పర సహకారంతో అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట
పోటీ అనేది మార్కెట్లో, వస్తు ఉత్పత్తిలోనే కానీ అత్యవసర సమయంలో కాదని పరిశ్రమల యాజమాన్యాలు నిరూపిస్తున్నాయి. ప్రధానంగా ప్రమాదాలు జరిగినప్పుడు సహకారం అందిసుండటం గమనార్హం.
న్యూస్టుడే, జిన్నారం
ఖాజీపల్లిలోని ఓ పరిశ్రమలో మంటలు ఆర్పుతూ..
పోటీ అనేది మార్కెట్లో, వస్తు ఉత్పత్తిలోనే కానీ అత్యవసర సమయంలో కాదని పరిశ్రమల యాజమాన్యాలు నిరూపిస్తున్నాయి. ప్రధానంగా ప్రమాదాలు జరిగినప్పుడు సహకారం అందిసుండటం గమనార్హం. నాలుగేళ్లుగా సంగారెడ్డి జిల్లాలోని అన్ని పారిశ్రామిక వాడల్లో ఈ స్ఫూర్తి కనిపిస్తోంది.
సూచనలు, సలహాలు
సాధారణంగా పారిశ్రామిక వాడల్లో ప్రమాదం అంటే అది భారీ స్థాయిలోనే ఉంటుంది. వీటి నివారణకు యాజమాన్యాలు ప్రత్యేక దృష్టిసారిస్తాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన భద్రతా సిబ్బందిని నియమించుకుంటారు. అయితే భారీ అగ్ని ప్రమాదాలు జరిగిప్పుడు సిబ్బంది సరిపోకపోవచ్చు. ఇలాంటి తరుణంలో ఒకరినొకరు సాయం అందిపుచ్చుకుంటే మంటల వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్ట పడుతుంది. ఏదైనా ఘటన జరగ్గానే వెంటనే సిబ్బందితో ప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నారు. మంటలకు కారణాలు, ఏ రసాయనం ఉంటుంది, నివారణకు చర్యలపై చర్చించి నిపుణుల సహకారంతో ప్రక్రియ ప్రారంభిస్తారు. పలు కర్మాగారాల్లో చిన్న అగ్నిమాపక శకటాలు ఉండగా వాటిని పంపిస్తున్నారు. గడ్డపోతారంలో హెటిరో, ఐడీఏ బొల్లారంలో డాక్టర్ రెడ్డీస్ పరిశ్రమల యాజమాన్యాలు జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలు లేకపోవడంతో ఎక్కడైనా ప్రమాదం జరగ్గానే వెంటనే స్పందిస్తున్నాయి. ఫోమ్, ఇసుక, ఇతరత్రా వాటిని సరఫరా చేస్తున్నారు.
భద్రతా శాఖ నిర్దేశంతో..
గతంలో ఇలాంటి సహకారం ఉండేది కాదు. కర్మాగారాల భద్రతా శాఖ సమస్యను గుర్తించి ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో అడుగేసింది. పరిశ్రమల యాజమాన్యాలు ఒకరినొకరు సహకరించుకోవాలని సూచనలు చేసింది. పరిశ్రమల వారీగా, పారిశ్రామిక వాడల్లో నిర్వహించే సమావేశాల్లో ఈ మేరకు అవగాహన సైతం కల్పించింది. జాతీయ భద్రతా వారోత్సవాల్లో ప్రత్యేకంగా సహకారంపై చర్చించేవారు. వీటిపైనే పోటీలు సైతం నిర్వహించడం గమనార్హం. వీటన్నింటి ఫలితంగా ఒకరికొకరు సహకారంతో పరిశ్రమల మధ్య స్నేహపూర్వక వాతారణం నెలకొంది.
తప్పక స్పందించాలి: నాగేశ్వర్రావు, ఏలూరి ఫార్మా ఎండీ
సమస్యను వెంటనే గుర్తించి ప్రతి పరిశ్రమ తప్పక స్పందించాలి. తమ వద్ద వస్తు, సిబ్బందితో ఘటనాస్థలికి వెళ్తే సమస్యకు పరిష్కారం చూపవచ్చు. రసాయనాల ప్రమాదం అంటే ఆచీ తూచీ వ్యవహరించాలి. నిపుణులతో ప్రమాదాన్ని సునాయాసంగా నివారించవచ్చు. ఇదే ప్రస్తుతం కొనసాగుతోంది.
రసాయనం గుర్తించి..: టీఎస్ఎం శేఖర్, పరిశ్రమ ప్రతినిధి, ఖాజీపల్లి
ప్రమాదం అంటే ముందుగా అక్కడ ఎలాంటి రసాయనాలు మండుతున్నాయో అధ్యయనం చేయాలి. దేంతో మంటలు ఆర్పవచ్చో నిపుణులు అంచనా వేస్తారు. ఒక వైపు సమీపంలోని వాటికి విస్తరించకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పారిశ్రామిక వాడల్లో ప్రస్తుతం మంచి వాతావరణ కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై ఛీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి