యాప్ కు తోడుగా..పారదర్శకంగా..
మహిళలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు.
పక్కాగా పొదుపు సంఘాల లెక్కలు, సమావేశాలు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, తాండూరు, పాపన్నపేట
మహిళా సంఘం సభ్యుల సమావేశం
మహిళలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇందులో ప్రభుత్వాలు సైతం ప్రోత్సహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అభ్యున్నతి దిశగా అడుగులు వేస్తున్నారు. పొదుపు సంఘాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. సంఘాల ఆధ్వర్యంలో సాగే కార్యకలాపాలు ఇక నుంచి ఆన్లైన్ బాట పట్టనున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ప్రక్రియ సాగే తీరు, కలిగే ప్రయోజనాలపై కథనం.
ఉపాధి దిశగా..
సంఘాల సభ్యులు సమష్టిగా పొదుపు చేసుకోవడంతో పాటు రుణాలు తీసుకొని వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వీరి ఆసక్తిని గమనించిన బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సైతం స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తోంది. ఈ తరుణంలో సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టిసారించడం గమనార్హం. ఇందుకు అనుగుణంగా ప్రత్యేకంగా సెర్ప్ ప్రొఫైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అంతర్జాలంలో లెక్కలు..
మహిళా సంఘాల సభ్యులకు సంబంధించిన పొదుపులు, రుణాలు, రుణవాయిదాలు తదితర లెక్కలన్నీ అంతర్జాలంలో నమోదు ప్రక్రియ నాలుగు జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. సంఘానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పొదుపులు, ఇందులోంచి సభ్యులకు ఇచ్చిన అంతర్గత రుణాలు, వసూలు వివరాలు కూడా యాప్లో అందుబాటులో ఉంచుతున్నారు. సభ్యుల వారీ వివరాలు సైతం ఉంటాయి.
సమావేశాల వివరాలు..
సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఎన్నో సంఘాలు ముందంజలో నిలిచాయి. ఎంతో మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. మెదక్ జిల్లాలో మంజీరా పేరిట వివిధ వస్తువులను విక్రయిస్తూ లాభాల బాట పట్టారు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో మహిళా రైతులతో కలిసి కందిపప్పు, ఇతర ఆపరాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ విక్రయిస్తోంది. ఇలా పలు సంఘాలు అభ్యున్నతి ఓ వైపు అడుగేస్తుండగా మరోవైపు కొన్ని చోట్ల సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రతినెలా నిర్వహించే రెండు సమావేశాల చిత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సిందే. పాత చిత్రం అప్లోడ్కు వీల్లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు.
రుణాలు, గ్రేడింగ్కు ప్రామాణికం
ప్రస్తుతం బ్యాంకు, స్త్రీ నిధి రుణాల మంజూరు సమయంలోనే మహిళా సంఘాల సభ్యులు ఒక చోట చేరుతున్నారు. కొత్త విధానం ప్రకారం సమావేశాలు సక్రమంగా నిర్వహించిన సంఘాలకే బ్యాంకు రుణాలు అందుతాయి. స్త్రీనిధి రుణాలకు సైతం ఇదే వర్తిస్తుంది. యాప్లో పక్కాగా వివరాలు నమోదు చేసిన వారికి గ్రేడింగ్ ఇస్తారు. అన్ని కార్యకలాపాలు సక్రమంగా నిర్వర్తిస్తేనే మంచి గ్రేడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే రుణాలు అందుతాయి. ఆయా సంఘాలకే రుణాల కోసం ఐకేపీ సిబ్బంది బ్యాంకు అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తారు.
సమగ్ర సమాచారం..
సూర్యారావు, అదనపు డీఆర్డీవో, సంగారెడ్డి
మహిళా సంఘాలకు సంబంధించి సమగ్ర సమాచారం అంతర్జాలంలో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆధార్, చిత్రాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. సంఘాలకు సంబంధించిన వివరాలన్నీ ప్రతినెలా యాప్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. చిత్రం అప్లోడ్ తప్పనిసరి కావడంతో సభ్యులందరూ హాజరవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు