హత్యకు దారి తీసిన చరవాణి చోరీ
చరవాణి చోరీ విషయంలో తలెత్తిన గొడవ యువకుడి హత్యకు దారి తీసింది. ఐడీఏ బొల్లారం సీఐ సురేందర్రెడ్డి తెలిపిన వివరాలు.. ఐడీఏ బొల్లారం పురపాలిక పరిధిలోని బాలాజీనగర్లో ఉండే భానుప్రసాద్(25) ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసేవాడు
నిందితులను పట్టుకున్న పోలీసులు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ సురేందర్రెడ్డి
గుమ్మడిదల, న్యూస్టుడే: చరవాణి చోరీ విషయంలో తలెత్తిన గొడవ యువకుడి హత్యకు దారి తీసింది. ఐడీఏ బొల్లారం సీఐ సురేందర్రెడ్డి తెలిపిన వివరాలు.. ఐడీఏ బొల్లారం పురపాలిక పరిధిలోని బాలాజీనగర్లో ఉండే భానుప్రసాద్(25) ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసేవాడు. ఈనెల 14న స్నేహితుడు ఫోన్ చేశాడని ఇంటినుంచి వెళ్లిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోడంతో మరసటి రోజు స్నేహితుల ఇళ్ల వద్ద వెదికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. 19న మధ్యాహ్నం బాలాజీనగర్ శివారులోని ఈత పొదల మధ్య కుళ్లిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం కావడంతో భానుప్రసాద్ కుటుంబ సభ్యులకు ఐడీఏ బొల్లారం పోలీసులు సమాచారం ఇచ్చారు. దుస్తులనుబట్టి మృతదేహం భానుప్రసాద్దిగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆయన ఏ స్నేహితుల వద్దకు వెళ్లింది చరవాణి కాల్డేటా, లొకేషన్లను పరిశీలించారు. బొల్లారానికి చెందిన వారే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. భానుప్రసాద్ ఇంటి దగ్గరే నివసించే బీహార్ రాష్ట్రానికి చెందిన సందేశ్ కుమార్, వికాస్కుమార్ హత్యకు పాల్పడినట్లు భావించారు. వారిని పట్టుకున్న పోలీసులు లోతుగా ఆరా తీయగా.. హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నెల రోజుల కిందట హతుడి తండ్రి బాల్రాజ్ తప్పతాగి పడిపోగా.. ఆయన మిత్రుడు సందేశ్కుమార్ సాయంతో ఇంటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో బాల్రాజ్ చరవాణి పడిపోవడంతో సందేశ్కుమార్ తీసుకున్నాడని అనుమానించిన భానుప్రసాద్ స్నేహితులతో కొట్టించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న సందేశ్కుమార్, ఆయన మిత్రుడు వికాస్కుమార్తో కలిసి అతడిని చంపడానికి పథకం రచించాడు. 14న మద్యం తాగుదామని భానుప్రసాద్ను సందేశ్కుమార్ ఫోన్ చేసి బాలాజీనగర్ శివారులోకి రావాలని పిలిచాడు. అప్పటికే అక్కడున్న వికాస్కుమార్తోపాటు అందరూ మద్యం తాగారు. అతడిని పొదల మధ్యకు తీసుకెళ్లి తలపై మందు సీసాతో కొట్టడంతో స్పృహ కోల్పోగానే బురదలో పడేశారు. బతికి ఉన్నాడని భావించి వెంట తెచ్చిన కత్తితో గొంతు కోసి హతమార్చారు. హత్యకేసు నిందితులిద్దర్నీ అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ సురేందర్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం