బర్దీపూర్లో భగ్గుమన్న భూ తగాదా!
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దీపూర్లో భూ తగాదాలు భగ్గుమన్నాయి. పొలం పంపకం విషయంలో బండమీది చంద్రయ్య(60) దారుణ హత్యకు గురయ్యాడు
పెదనాన్నను దారుణంగా హత్యచేసిన తమ్ముడి కుమారుడు
వీడియో రికార్డు చేసి ఫేస్బుక్లో అప్లోడ్
న్యూస్టుడే- ఝరాసంగం, జహీరాబాద్ అర్బన్: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దీపూర్లో భూ తగాదాలు భగ్గుమన్నాయి. పొలం పంపకం విషయంలో బండమీది చంద్రయ్య(60) దారుణ హత్యకు గురయ్యాడు. జహీరాబాద్ గ్రామీణ సీఐ వెంకటేశ్, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. బర్దీపూర్కు చెందిన చంద్రయ్య, రత్నం అన్నదమ్ములు. మూడెకరాల పొలం పంపకం విషయంలో కొన్నేళ్లుగా వారి మధ్య గొడవలున్నాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినా.. గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం చంద్రయ్య పొలానికి వెళ్లిన విషయం తెలుసుకున్న ఆయన తమ్ముడు రత్నం కుమారుడు రాకేశ్ అటవీ ప్రాంతంలో మాటువేశాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న చంద్రయ్యను అడ్డగించి వెంట తెచ్చుకున్న తల్వార్తో మెడపై వేటు వేసి తల, మొండెం వేరు చేశాడు.
వివరాలు చెబుతున్న రాకేశ్
తలతో ఊళ్లో హల్చల్..
చంద్రయ్య తలను గ్రామంలోకి తీసుకొచ్చిన రాకేశ్ హల్చల్ చేశాడు. ఊరి నడిబొడ్డున ఉన్న బసవేశ్వర విగ్రహం వద్దకు వచ్చి.. ‘నన్ను, నా కుటుంబాన్ని మా పెదనాన్న ఏళ్లుగా వేధిస్తున్నాడు. న్యాయంగా దక్కాల్సిన భూమి పంచకుండా రాజకీయం చేస్తున్నాడు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఆయనకే మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే ఆయనను చంపేశా’ అని వీడియో రికార్డ్ చేయించి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. అక్కణ్నుంచి ఆటోలో ఝరాసంగం వైపు వెళ్లి తలను రోడ్డు పక్కన పారేశాడు. హత్య ఘటనలో రాకేశ్ ఒక్కడే పాల్గొన్నాడా.. లేక ఇతరులు సహకరించారా.. ప్రయాణించిన ఆటో, వీడియో తీసిందెవరు.. తదితర విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చంద్రయ్యకు భార్య పూలమ్మ, కుమారుడు ప్రశాంత్, ముగ్గురు కూతుళ్లున్నారు. కుటుంబ సభ్యులు తలలేని మొండెం చూస్తూ గుండెలవిసేలా రోదించడం చూపరులను కలచివేసింది. హత్య విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశ్.. ఝరాసంగం, హద్నూర్ ఎస్సైలు రాజేందర్రెడ్డి, వినయ్కుమార్తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన తల్వార్ కవర్ను స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు జహీరాబాద్ గ్రామీణ ఠాణాలో లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ