దర్జీలకు అందని కుట్టు కూలీ
వచ్చే విద్యా సంవత్సరం(2023-24)కు సంబంధించి ఏక రూప దుస్తుల కోసం వస్త్రం వచ్చేసింది. జూన్ 12న పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసేలా విద్యాశాఖ కసరత్తు చేస్తొంది.
ఏడాదిగా ఎదురుచూపులు
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ
వచ్చే విద్యా సంవత్సరం(2023-24)కు సంబంధించి ఏక రూప దుస్తుల కోసం వస్త్రం వచ్చేసింది. జూన్ 12న పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసేలా విద్యాశాఖ కసరత్తు చేస్తొంది. ప్రస్తుత(2022-23) విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎకరూప దుస్తుల ‘కుట్టు’ బకాయిలు ఇప్పటికీ దర్జీలకు చెల్లించలేదు. జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు, ఏజెన్సీలకు ప్రతి ఏడాది ఏకరూప దుస్తులు కుట్టించే బాధ్యత అప్పగిస్తున్నారు. ఈ ఏడాది వారికి డబ్బులు చెల్లించకపోవడంతో మళ్లీ బాధ్యత ఎలా అప్పగించాలని ప్రధానోపాధ్యాయులు మదన పడుతున్నారు. బకాయిలు చెల్లించకుంటే నిర్వాహకులు ముందుకు రాకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కథనం.
రూ.98.76 లక్షల బకాయిలు
జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యాశాఖ ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు అందిస్తోంది. ఇందుకు అవసరమైన వస్త్రాన్ని టెస్కో ద్వారా విద్యాశాఖ కొనుగోలు చేసి పాఠశాలలకు పంపిణీ చేస్తోంది. పాఠశాల యాజమాన్య కమిటీ తీర్మానం మేరకు కుట్టించి విద్యార్థులకు అందజేస్తారు. జిల్లాలో 1,23,459 మంది విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సరం రెండు జతల దుస్తులు మహిళా సంఘాల సభ్యులు, దర్జీల వద్ద కుట్టించి విద్యార్థులకు గతేడాది ఆగస్టులో పంపిణీ చేశారు. ఒక్కో జతకు రూ.40 చొప్పున రెండు జతలకు కలిపి రూ.80 కుట్టి కూలీ అందజేయాలి. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన నిధులు విద్యాశాఖ విడుదల చేయలేదు. రూ.98.76 లక్షల బకాయిలు పేరుకుపోయాయి.
మండలాలకు చేరనున్న కొత్త వస్త్రం
విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన వస్త్రం మరో నాలుగైదు రోజుల్లో మండల కేంద్రాలకు చేరనుంది. మండల విద్యాధికారులు ఆ వస్త్రాన్ని పాఠశాలలకు పంపించాలి. మహిళా సంఘాల సభ్యులు, దర్జీలతో కుట్టించి జూన్ మొదటి వారం వరకు పాఠశాలలకు అందించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాత బకాయిలే చెల్లించలేదని.. కొత్తది ఎలా కుట్టించాలని ప్రధానోపాద్యాయులు చెబుతున్నారు.
నాలుగైదు రోజుల్లో విడుదల
ఏకరూప దుస్తులకు సంబంధించిన కుట్టు కూలీ నిధులు విడుదల చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరారు. తాము కూడా ఉన్నతాధికారులకు విన్నవించాం. నాలుగైదు రోజుల్లో ఈ నిధులు నేరుగా పాఠశాలల ఖాతాలో జమయ్యే అవకాశం ఉంది. - వెంకటేశం, సెక్టోరియల్ అధికారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో