మంత్రి ఆదేశించినా.. అధికారుల నిర్లక్ష్యం
జాతీయ రహదారి 65 పక్కన ప్రవహిస్తున్న మురుగు కాలువలను తలపిస్తోంది. దీనివల్ల రోడ్డు కుచించుకుపోవడంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్నాయి.
జాతీయ రహదారి వెంట నామమాత్రంగా పనులు
ఈనాడు, సంగారెడ్డి: జాతీయ రహదారి 65 పక్కన ప్రవహిస్తున్న మురుగు కాలువలను తలపిస్తోంది. దీనివల్ల రోడ్డు కుచించుకుపోవడంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈనెల 6న సంగారెడ్డి పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్రావు ఈ విషయాన్ని గమనించారు. తక్షణం సమస్య పరిష్కరించాల్సిందిగా పంచాయతీ, పురపాలిక అధికారులను ఆదేశించారు. మరోసారి వచ్చేసరికి పూర్తిస్థాయిలో పనులు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు కొన్ని చోట్ల మొక్కుబడిగా పనులు చేసి మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. మురుగు ప్రవహించేందుకు పైపులు వేయాల్సిన అధికారులు చాలా చోట్ల తవ్వి అలాగే ఉంచారు. రోడ్డుపై పోసిన మట్టికుప్పల వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారమేర్పడింది. కంది చౌరస్తా దాటిన తర్వాత నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోంది. ఈ మధ్యదూరంలో రెండు చోట్ల మలుపులు తీసుకునే అవకాశం ఉంది. వాహనాల వేగం తగ్గించేందుకు వీలుగా సూచికలు, ఏర్పాట్లు ఉండాలి. ఈ దిశగా ఎలాంటి చర్యలు లేవు. ఇటీవల సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ కుమారుడు ప్రశాంత్ ఈ మార్గంలోనే మృత్యువాతపడ్డారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి హరీశ్రావు దృష్టికి అక్కడే ఉన్న కొందరు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ రోడ్డుకు ఇరువైపులా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. రహదారి పక్కనే లారీలు నిలపడం, ఇసుక నింపుతుండటంతో రోడ్డు వెంట ఆ ఇసుక ప్రమాదకరంగా నిలుస్తోంది. పూర్తిగా మట్టితో నిండిపోతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ రెండు కిలోమీటర్ల పొడవునా పనులు పూర్తయ్యేలా చూడాలని, ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
రోడ్డు పక్కనే ఇసుక విక్రయాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!