‘మంగళ’కరం.. మనోధైర్యం
జీవనశైలిలో మార్పులు... ఆహారపు అలవాట్లు... ఒత్తిడి, ఆందోళనలతో ఇటీవల ఎక్కువ మంది మహిళలు హార్మోన్ అసమతుల్యత (పీసీవోఎస్), థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నారు.
మహిళా క్లినిక్లకు స్పందన
అల్లాదుర్గంలో పరీక్షలకు వచ్చిన మహిళలు
న్యూస్టుడే, మెదక్: జీవనశైలిలో మార్పులు... ఆహారపు అలవాట్లు... ఒత్తిడి, ఆందోళనలతో ఇటీవల ఎక్కువ మంది మహిళలు హార్మోన్ అసమతుల్యత (పీసీవోఎస్), థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నారు. సహజ ప్రక్రియ అయిన మెనోపాజ్తో సతమతమవుతున్నారు. పలువురు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇవి నాలుగు వారాల్లో అతివలకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో తేలిన అంశాలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లాకు, అక్కడా సదుపాయాలు లేకపోతే హైదరాబాద్కు పంపిస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చిన వారికి ఔషధాలను అందజేస్తున్నారు. అవసరమైన వారికి ల్యాబ్ పరీక్షలు చేస్తున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, టేక్మాల్, శివ్వంపేట, మనోహరాబాద్, వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)ను ఎంపిక చేశారు. ప్రతి మంగళవారం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళా వైద్య, ఆరోగ్య సిబ్బంది పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స మందుల పంపిణీతో పాటు అనుశీలన చేస్తున్నారు. అన్ని వయస్సుల స్త్రీలకు 8 రకాల సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. రోగనిర్ధారణ, క్యాన్సర్/ ఇతర రోగాల స్క్రీనింగ్, సూక్ష్మ పోషక లోపాల గుర్తింపు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ అసమతుల్యతలు (పీసీవోఎస్), మెనోపాజ్ నిర్వహణ, లైంగిక వ్యాధుల నివారణ, శరీర బరువు వంటి అంశాలను ఆరోగ్య కార్డులో నమోదు చేస్తున్నారు.
మెనోపాజ్, పీసీవోఎస్తో....
జిల్లాలోని ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత నాలుగు వారాల్లో 40 ఏళ్లలోపు వారు 606 మందికి, 40 ఏళ్లపైబడిన వారు 751 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎక్కువ మంది మెనోపాజ్, పీసీవోఎస్తో సతమతమవుతున్నారు. మరో వైపు వివిధ రకాల క్యాన్సర్లతో 11 మంది బాధపడుతున్నారు. పరీక్షలు చేసుకున్న 1,357 మందిలో 372 మందికి రక్తహీనత సాధారణ స్థితిలో ఉండగా, 510 మందికి తేలికపాటిగా, 463 మందికి మోస్తరు, 12 మందికి తీవ్రంగా ఉంది.
అత్యవసర కేసులు సిఫార్సు
ఆయా పీహెచ్సీల్లో పరీక్షలు నిర్వహించిన అనంతరం వ్యాధి తీవ్రత ప్రకారం పలువురిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఆరు పీహెచ్సీల నుంచి 66 మందిని మెదక్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఇక్కడా వారికి తిరిగి పరీక్షలు నిర్వహించి అవసరమైన ఔషధాలు అందజేయనున్నారు. లేదంటే చికిత్స అందిస్తారు. జిల్లా ఆసుపత్రి నుంచి ఇద్దరిని గాంధీకి పంపించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 366 మందికి ఔషధాలను అందజేయగా, వారి రుగ్మతలను బట్టి 228 మందికి ల్యాబ్ పరీక్షలు చేశారు. ఆయా పీహెచ్సీల్లో వైద్యులు మహిళలకు తగిన సూచనలు. సలహాలు అందిస్తున్నారు.
క్రమేణా పెరుగుతున్నారు: చందునాయక్, జిల్లా వైద్యాధికారి
ఆరోగ్య మహిళా ఆసుపత్రుల్లో ఓపీ క్రమేణా పెరుగుతోంది. ఉచితంగా వ్యాధి నిర్ధారణ, నివారణ సేవలు అందిస్తుండటంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి, వ్యాధి తీవ్రతను బట్టి జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నాం. ఆయా రుగ్మతలతో బాధపడే వారికి వైద్య చికిత్స అందించడం, ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిపై అనుశీలన చేయాలని సిబ్బందికి సూచించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులకు నిర్వహణ నిధులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. -
కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
[ 28-03-2024]
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. -
సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
[ 28-03-2024]
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. -
గడువు ముంగిట పనుల హడావుడి
[ 28-03-2024]
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. -
కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు
[ 28-03-2024]
కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. -
విద్యార్థులకు ప్రేరణ
[ 28-03-2024]
ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఈత కొలను తెరవరా?
[ 28-03-2024]
సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. -
అరచేతిలో లక్షల పుస్తకాలు
[ 28-03-2024]
ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
స్పందించండి.. సంధించండి
[ 28-03-2024]
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. -
మహిళాభ్యున్నతికి సహకారం
[ 28-03-2024]
సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. -
దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం
[ 28-03-2024]
వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. -
ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
[ 28-03-2024]
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. -
నిండు మనసుతో ఆశీర్వదించండి
[ 28-03-2024]
ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. -
మాజీ కలెక్టర్కు వేల కోట్లు ఎక్కడివి?
[ 28-03-2024]
భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు.డిమాండ్ చేశారు. -
భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్రెడ్డి
[ 28-03-2024]
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!