చదివే బాధ్యత మీది.. సౌకర్యాల కల్పన నాది
‘చదివే బాధ్యత మీది.. సౌకర్యాల కల్పన బాధ్యత నాది. ఇదే మీకు నాకు మధ్య పోటీ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విద్యార్థులతో అన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు.
మంత్రి హరీశ్రావు
నంగునూరు భారాస ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్రావు, వేదికపై జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు
సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: ‘చదివే బాధ్యత మీది.. సౌకర్యాల కల్పన బాధ్యత నాది. ఇదే మీకు నాకు మధ్య పోటీ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విద్యార్థులతో అన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. పట్టణంలో ఓయూ పీజీ కళాశాల అనుబంధంగా నిర్మించిన మహిళలు, పురుషుల వసతి గృహాలను బుధవారం ఓయూ ఉప కులపతి ప్రొఫెసర్ రవీందర్తో కలిసి ఆయన ప్రారంభించి, మాట్లాడారు. మీడియా ల్యాబ్, స్కిల్ సెంటర్ కావాలని ఎంసీజే, ఎంబీఏ విద్యార్థులు నిహారిక, సంజీవ్ కోరగా, త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది బీఎస్సీ అగ్రికల్చర్, బీబీఎస్సీ, లా, బీఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఉప కులపతి ప్రొ.రవీందర్ మాట్లాడుతూ.. వర్సిటీల్లో పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే కామన్ రిక్రూట్మెంట్ బోర్డును అసెంబ్లీ ఆమోదించిందని, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడంతో 2 వేల ఉద్యోగాల భర్తీకి ఆటంకం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, పీజీ కళాశాల ప్రిన్సిపల్ రవినాథ్, కౌన్సిలర్ శ్రీదేవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సీహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దేశ ప్రజల సేవ మన బాధ్యత
నంగునూరు, న్యూస్టుడే: తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస ఇప్పడు జాతీయ స్థాయిలో భారాసగా విస్తరిస్తోందని కార్యకర్తలందరూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని మంత్రి హరీశ్రావు కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరులో మండలస్థాయి భారాస కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గులాబీ జెండా ఎత్తింది నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయం నుంచేనని అదే సెంటిమెంట్గా నంగునూరు నుంచే ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. కాంగ్రెస్, భాజపా నాయకుల మాటలను నమ్మొద్దని, ఆపదలో ఆదుకొని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన భారాసకు అండగా నిలవాలని కోరారు. కార్యకర్తల మధ్య చిన్నచిన్న పొరపొచ్ఛాలుంటే కుటుంబం మాదిరిగా కలిసి మాట్లాడుకుందామని సూచించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జిల్లా జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ మాట్లాడారు. నంగునూరు పెద్దవాగులోకి కాళేశ్వరం జలాలు వచ్చిన నేపథ్యంలో రోజాశర్మతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. రైబస మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ ఉమ, ఏఎంసీ ఛైర్మన్ రాగుల సారయ్య, పీఏసీఎస్ ఛైర్మన్లు రమేశ్గౌడ్, మహిపాల్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అదానీ, అంబానీ ఆదాయం పెంచేందుకే కేంద్రం ప్రయత్నం
సీఎం కేసీఆర్ తెలంగాణలో సంపద పెంచి పేద ప్రజలకు పంచుతుంటే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పేదలపై పన్నులు విధించి అదానీ, అంబానీల ఆదాయం పెంచుతోందని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ.2000 కోట్లు వెచ్చించి నాణ్యమైన, నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తోందని తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో పేద ప్రజలకు ఇబ్బందులు తప్ప ఎలాంటి మేలు జరగలేదన్నారు. డిజిటల్ చెల్లింపులు అంటూ పేటీఎం, గూగుల్పే లాంటివి అలవాటు చేసి ఇప్పుడు వాటిపై 1.1 శాతం పన్ను విధించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?