logo

‘ప్రాణమున్నంత వరకు ప్రజా సేవ చేస్తా’

ప్రాణమున్నంత వరకు ప్రజాసేవ చేస్తానని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో గురువారం పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు.

Updated : 31 Mar 2023 06:43 IST

ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కేకు తినిపిస్తున్న సునీతా లక్ష్మారెడ్డి

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: ప్రాణమున్నంత వరకు ప్రజాసేవ చేస్తానని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో గురువారం పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. వేడుకలకు భారీ ర్యాలీగా తరలివచ్చిన ఎమ్మెల్యే రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డితో కలసి కేక్‌ కోశారు. మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు తనపై ఉన్న నమ్మకంతో ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇతర నియోజకవర్గాలకంటే మెరుగ్గా అభివృద్ధి పనులు చేశానని అన్నారు. నియోజకవర్గంలో 29 బీటీ రోడ్ల పునరుద్ధరణకు రూ.47.25 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. సునీతాలక్ష్మారెడ్డి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రాగౌడ్‌, భారాస రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్‌గుప్తా, జడ్పీ కోఆప్షన్‌ సభ్యులు మన్సూర్‌, ఎంపీపీ నర్సింగ్‌రావు, జడ్పీటీసీ బబ్యానాయక్‌, సహకార సంఘం అధ్యక్షులు రాజుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని