logo

దేశమంతటా కాంగ్రెస్‌ అనుకూల పవనాలే..

కేంద్రంలోని భాజపా పాలనపై అందరూ విసిగిపోయారని, రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు.

Published : 01 Apr 2023 01:41 IST

మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌

మాట్లాడుతున్న ప్రసాద్‌ కుమార్‌, చిత్రంలో బాలకృష్ణ, ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: కేంద్రంలోని భాజపా పాలనపై అందరూ విసిగిపోయారని, రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం మెదక్‌లోని డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌ గాంధీ అణుబాంబు కంటే శక్తివంతుడని భారత్‌ జోడో యాత్రతో నిరూపించారన్నారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. మోదీ నాయకత్వంలో పెద్దోళ్లు మాత్రమే ఎదుగుతున్నారని, పేదోళ్లకు దక్కుతున్నదేమీ లేదన్నారు. దేశ సంపదను అదానీ, లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీలకు దోచిపెడుతున్న నరేంద్రమోదీని ప్రశ్నించినందుకు రాహుల్‌గాంధీపై కుట్ర పూరిత కేసు నమోదు చేయించి, పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించారని ధ్వజమెత్తారు. గతంలో సోనియా, రాహుల్‌ గాంధీపై చేసిన పరుష వ్యాఖ్యలు గుర్తులేవా అని ప్రశ్నించారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పవనాలు వీస్తున్నాయని, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారం సాధించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. పీసీసీ నాయకులు మ్యాడం బాలకృష్ఱ, ఆవుల రాజిరెడ్డి, మామిళ్ళ ఆంజనేయులు, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నాయకులు శ్రీకాంత్‌, రమేష్‌గౌడ్‌, సల్మాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని