హమ్మయ్యా.. ఉపాధి కూలీ పెరిగింది
రెండేళ్లుగా వేసవి భత్యం చెల్లింపును నిలిపివేసిన కేంద్రం.. ఉపాధి కూలీలకు దినసరి కూలీ రేట్లను పెంచింది.
నేటి నుంచి అమలు
న్యూస్టుడే, మెదక్
రెండేళ్లుగా వేసవి భత్యం చెల్లింపును నిలిపివేసిన కేంద్రం.. ఉపాధి కూలీలకు దినసరి కూలీ రేట్లను పెంచింది. రానున్న రెండు, మూడు నెలలు పనులు జోరుగా కొనసాగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కూలీలకు కాస్త ఉపశమనం కలిగించనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు నిర్వహించే వెసులుబాటు ఉండగా, ప్రస్తుత తరుణంలో పెద్దసంఖ్యలో కూలీలు పనులకు హాజరయ్యే అవకాశం ఉంది. 2023-24 ఆర్థికసంవత్సరం ఏప్రిల్ 1 నుంచి పెరిగిన రేటు ప్రకారం కూలీ చెల్లించనున్నారు.
30 వేల మంది..
వలసల నివారణకు చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు వరంగా మారింది. ఉన్న ఊర్లోనే పనులు చేసుకునే అవకాశంతో పాటు కుటుంబ సభ్యులంతా పనులు చేసే వెసులుబాటు ఉంది. జిల్లాలో 1,60,692 జాబ్కార్డులు ఉన్నాయి. కూలీలు 3,22,816 మంది ఉన్నారు. ప్రస్తుతం నిత్యం 30 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ (ఎన్ఎంఎంఎస్) విధానంతో ఇబ్బందులు ఎదురవగా కూలీల సంఖ్య తగ్గింది. చేసిన పనులకు కూలి చెల్లించేందుకు జాబ్కార్డులు, బ్యాంకు ఖాతాలు, ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది.
మూడు నెలలు..
ఏటా మార్చి నుంచి జూన్ వరకు సాగు పనులు తక్కువగా ఉండటం వల్ల పనులకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో నిర్దేశించుకున్న లక్ష్యం ఆధారంగా వచ్చే మూడు నెలల్లో ఎక్కువ శాతం పనుల పూర్తికి అధికారులు దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం రోజు వారి కూలి రూ.257 ఉండగా, ఏప్రిల్ 1 నుంచి రూ.272 చెల్లించనున్నారు. ప్రస్తుతం సగటు కూలీ రూ.171 అందుతోంది. మండుటెండల్లో పనులు చేయాల్సి ఉండటంతో కేంద్రం వేసవి ప్రత్యేక భత్యం చెల్లించేది. ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం వరకు అదనంగా ఇచ్చే వారు. గతేడాది నుంచి దీన్ని కేంద్రం నిలిపివేసింది. ఈ తరుణంలో ఇప్పుడు పెరిగిన భత్యం ఊరటనిచ్చే అంశం.
47.18 లక్షల పని దినాలు
2023-24 ఆర్థిక సంవత్సరంలో 47.18 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతంలో చేసిన పనుల కొలతల చిత్రం వారానికోసారి తీసి ఆన్లైన్లో నమోదు చేసేవారు. కొత్త విధానం ప్రకారం రోజుకు రెండు సార్లు చిత్రాలు తీసి ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. వేసవి నేపథ్యంలో ఉదయాన్నే వచ్చి కొలతల ప్రకారం పనులు చేసుకుని వెళ్తున్న కూలీలు, మధ్యాహ్నం మళ్లీ పనుల వద్దకు వచ్చి ఫొటో తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీన్ని తొలగించాలని కూలీలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి