అడవిలో జల సంపదకు నిర్మాణాలు
అటవీ శాఖ అంటే అడవులతో పాటు వన్యప్రాణుల సంరక్షించడమే కాదు. విధి నిర్వహణ దృష్ట్యా ఆ పని చేస్తూనే విధుల నేల సంరక్షణతో పాటు భూ గర్భ జలాలను పెంపునకు కృషి చేస్తున్నారు.
బహుళ ప్రయోజనాలకు వేసవిలో చర్యలు
న్యూస్టుడే: హుస్నాబాద్ గ్రామీణం
కోహెడ మండలం శనిగరం అడవుల్లో నిర్మించిన చెక్డ్యాం
అటవీ శాఖ అంటే అడవులతో పాటు వన్యప్రాణుల సంరక్షించడమే కాదు. విధి నిర్వహణ దృష్ట్యా ఆ పని చేస్తూనే విధుల నేల సంరక్షణతో పాటు భూ గర్భ జలాలను పెంపునకు కృషి చేస్తున్నారు. ఇందుకు హుస్నాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చేపడుతున్న చర్యలే ఇందుకు చక్కని నిదర్శనం. ఈ చర్యల ద్వారా అడవుల్లో పెరిగే చెట్లకు నీరందడంతో పాటు వన్యప్రాణులు దాహం తీర్చుకోవచ్చు. హుస్నాబాద్ అటవీక్షేత్ర (ఫారెస్ట్ రేంజ్) పరిధిలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూల్మిట్ట, బెజ్జంకి మండలాలు ఉన్నాయి. మొత్తం 4065 హెక్టార్లలో అడవుల విస్తీర్ణం ఉంది. ఇందులో హుస్నాబాద్, శనిగరం, ఆకునూర్, మీర్జాపూర్, చుంచనకోట 1, చుంచనకోట 2, నాగపురి, గురువన్నపేట బీట్లు ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపడుతూనే నేల సంరక్షణ, భూగర్బ జలాలను పెంచేందుకు పలు చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలంలో నీరు ఎత్తు నుంచి పల్లపు ప్రాంతానికి ప్రవహించి వెళ్లిపోతుంది. నేల కోతకు గురవుతుంది. భూసారం తగ్గుతుంది. చెట్ల వేళ్లు పైకి తేలి, ఈదురు గాలులకు కూలుతాయి. నీటి నిల్వ లేకపోవడంతో వేసవిలో వన్యప్రాణులకు నీరు దొరకదు. దాహం తీర్చుకోవడానికి జనావాసాల వైపు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతుంటాయి. వీటన్నింటినీ నివారించేందుకు ‘సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్’లో భాగంగా అడవుల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. దాదాపు 50 రోజులుగా వివిధ నిర్మాణాలు చేపట్టారు.
భూగర్బ జలాలు పెంచే చర్యలు
అడవుల్లో భూగర్బ జలాలను పెంచేందుకు బహుళ ప్రయోజన చర్యలు చేపడుతున్నారు. మొదట ఎక్కువ నీటిని నిల్వ చేసేందుకు అనువైన లోతట్టు ప్రాంతాలను గుర్తిస్తున్నారు. వర్షపు నీటికి ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసి నిల్వ చేసేందుకు చెక్డ్యాంలు, ట్యాంకులు, ఫాంపాండ్స్, గుట్టల చుట్టూ కాంటూరు కందకాలు తవ్వుతున్నారు. కోహెడ మండలం శనిగరం పరిధిలో ఒక చెక్డ్యాం పూర్తి చేశారు. పర్క్యులేషన్ ట్యాంకులు 5, ఫాంపాండ్స్ 3 తవ్వించారు. చేర్యాల పరిధిలో 2 ఫాంపాండ్స్ తవ్వించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో అందులోకి నీరు చేరింది. హుస్నాబాద్ పరిధిలో అటవీ భూమిని ఇతరులు ఎవరూ ఆక్రమించకుండా ఉండేందుకు హద్దు రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
అక్కన్నపేట మండలం రేగొండలో తవ్వించిన ఫాంపాండ్లో నిలిచిన నీరు
వేసవిలో అనుకూలం
సందీప్కుమార్, హుస్నాబాద్ ఎఫ్ఆర్వో
వేసవికాలంలో చెక్ డ్యాంలు, పర్క్యులేషన్ ట్యాంకులు, ఫాంపాండ్స్ నిర్మించేందుకు అనువైన సమయం. అందుకే వీటి నిర్మాణం చేపట్టాం. ఇప్పటివరకు పదకొండు వర్షపు నీటిని నిల్వ చేసే పనులు చేపట్టాం. దాదాపు అన్నీ పూర్తి కావచ్చాయి. అకాల వర్షాలతో కొంతవరకు నీరు చేరింది. వీటితో పాటు వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు గతంలో అడవుల్లో నిర్మించిన సాసర్ పిట్లలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నాం. ప్రస్తుత నిర్మాణాలతో వర్షపు నీటిని నిల్వ చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు