‘యాప్’ వేసుకొని.. సైబర్ వలలో చిక్కి
సిద్దిపేట మూడో పట్టణ ఠాణా పరిధిలో ఓ వ్యక్తికి సైబర్ నేరగాడు ఫోన్ చేసి పేటీఎం ద్వారా రూ.5 లక్షల రుణం మంజూరైందని దానికోసం రస్క్ డెస్క్టాప్ యాప్ చరవాణిలో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించాడు.
సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: సిద్దిపేట మూడో పట్టణ ఠాణా పరిధిలో ఓ వ్యక్తికి సైబర్ నేరగాడు ఫోన్ చేసి పేటీఎం ద్వారా రూ.5 లక్షల రుణం మంజూరైందని దానికోసం రస్క్ డెస్క్టాప్ యాప్ చరవాణిలో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించాడు. నమ్మిన బాధితుడు యాప్ను ఇన్స్టాల్ చేసుకుని వివరాలు నమోదు చేయగానే రూ.1,43,749 కోల్పోయాడు. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి మర్చంట్ ప్లేస్ సంస్థ పేరుతో చరవాణికి సందేశం రాగా అందులో వివరాలు నమోదు చేశాడు. వెంటనే అతని అకౌంట్ నుంచి రూ.25 వేలు డెబిట్ అయ్యాయి. భూంపల్లి-అక్బర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి రూపే రుణ యాప్లో ద్వారా రుణం తీసుకుని డబ్బులు చెల్లించాడు. ఓ నేరగాడు ఫోన్ చేసి మళ్లీ డబ్బులు కట్టాలని, లేకపోతే వివరాలు తమ దగ్గర ఉన్నాయని బెదిరించటంతో రూ.24,990 చెల్లించాడు. తర్వాత ఫోన్ చేస్తే స్పందన కరువైంది. జగదేవపూర్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి సైబర్నేరగాడు ఫోన్ చేసి తమ సంస్థలో రూ.4999 విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే లాప్టాప్ ఉచితంగా వస్తుందని నమ్మించాడు. దీనికోసం ప్రాసెసింగ్ ఛార్జీ, జీఎస్టీ కింద డబ్బులు చెల్లించాలని కోరగా రూ.24,980 చెల్లించాడు. తర్వాత ఫోన్చేస్తే స్పందన రాలేదు. పట్టణ మూడవ ఠాణా పరిధిలో ఓ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా హనీట్రాప్ చేసి రూ.2800 కాజేశాడు. ముందుగా ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా బాధితుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. వెంటనే సైబర్ నేరగాడు ఫోన్ చేసి న్యూడ్ కాల్ చేశావని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా భయపడిన బాధితుడు సదరు సొమ్ము పంపించి కోల్పోయాడు. పై కేసుల్లో సంబంధిత బాధితులందరూ 1930కి ఫిర్యాదు చేశారు. సిద్దిపేట వన్టౌన్, భూంపల్లి ఠాణా పరిధుల్లో ఇటీవల జరిగిన సైబర్ నేరాల్లో శుక్రవారం రూ.75,108 నిలుపుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని