పనుల్లో తాత్సారం ఏళ్లుగా నిర్మాణం!
గ్రామీణుల కష్టాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా నిధులు మంజూరు చేస్తున్నాయి. క్షేత్రస్థాయి ఇబ్బందులు తీర్చేందుకు వివిధ భవనాలు నిర్మించేలా ప్రోత్సహిస్తున్నాయి.
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, జిన్నారం, హత్నూర
గ్రామీణుల కష్టాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా నిధులు మంజూరు చేస్తున్నాయి. క్షేత్రస్థాయి ఇబ్బందులు తీర్చేందుకు వివిధ భవనాలు నిర్మించేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఆయా నిర్మాణాలు ఏళ్లుగా పూర్తికావడం లేదు. నియోజకవర్గ అభివృద్ధి నిధి(సీడీపీ), జిల్లా ప్రజా పరిషత్, ఎస్డీఎఫ్ తదితర నిధులతో ఈ పనుల చేపట్టగా.. పంచాయతీ రాజ్ శాఖ పర్యవేక్షిస్తోంది. ఈ పనుల్లో తీవ్ర జాప్యంపై కథనం.
నిబంధనల విస్మరణ
గుత్తేదారుతో ఒప్పందం జరిగిన ఏడాది లోపు పనులు పూర్తి చేయాలని నిబంధనలు ఉన్నా.. జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. తొలుత గుత్తేదారు ఆర్భాటంగా ముందుకు వస్తున్నా.. ఆ తర్వాత చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. సకాలంలో బిల్లులు రాకపోవడమూ కారణనే విమర్శలున్నాయి.
అదనపు నిధులు కావాలని ప్రభుత్వానికి నివేదించాం
జగదీశ్వర్, పీఆర్ ఈఈ
జిల్లాలో వివిధ పథకాల కింద చేపట్టిన నిర్మాణాలు చాలా చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. వాటి వివరాలు ఎప్పటికప్పుడు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి అదనపు నిధులు మంజూరు చేయగానే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేస్తాం.
పిల్లర్ల స్థాయి దాటని తరగతి గదులు
జిన్నారం మండలం వావిలాలలో రూ.30 లక్షల నిధులను ప్రాథమిక పాఠశాల భవనానికి మంజూరు చేశారు. అయిదు గదులుగా నిర్మించాలి. అయిదేళ్ల క్రితమే నిధులు మంజూరు చేయగా అప్పట్లో గుత్తేదారు ఆర్భాటంగా పనులు చేపట్టారు. పిల్లర్ల వరకు పూర్తి చేసి అయిదేళ్లు అవుతున్నా.. ఎలాంటి పురోగతి లేదు. గుత్తేదారు పనులను రద్దు చేసి ఇతరులకు టెండర్ల ద్వారా కేటాయించాల్సి ఉన్నా.. సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. నిర్మాణం అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.
కొన్ని చోట్ల నిధుల కొరత
హత్నూర మండలం కాసాలలో..
* హత్నూర మండలం కాసాల శివారులో షాదీఖానా నిర్మాణానికి రూ.7 లక్షలతో పనులు చేపట్టారు. ఆ భవనం పిల్లర్ల దశ వరకు వేగంగా పూర్తి చేసినా.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. 15 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. నిధుల కొరతతో గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశారు. ఈ విషయాన్ని గ్రామస్థులు పలుసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎలాంటి స్పందన లేదు.
* సంగారెడ్డి మండలం కొత్లాపూర్లో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు. స్లాబ్ వరకు పనులు చేసి వదిలేశారు. సరిపడా నిధులు లేకపోవడంతో ఆరేళ్లుగా ఈ పరిస్థితి నెలకొంది. కొండాపూర్, కంది, సదాశివపేట మండలాల్లోనూ అసంపూర్తి భవనాలు, మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చేపి భవనాలు వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు