లక్ష్యం.. ఆరోగ్య కార్మిక లోకం
భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులవి రెక్కాడితో కానీ డొక్కాడని బతుకులు. అకస్మాత్తుగా కుటుంబ పెద్ద అనారోగ్యం బారిన పడితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది.
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, గజ్వేల్ గ్రామీణ, చేగుంట, పరిగి, వికారాబాద్ మున్సిపాలిటీ
భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులవి రెక్కాడితో కానీ డొక్కాడని బతుకులు. అకస్మాత్తుగా కుటుంబ పెద్ద అనారోగ్యం బారిన పడితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. వ్యాధిని ముందే గుర్తిస్తే సకాలంలో చికిత్స అందించడం సులభంగా ఉంటుంది. ఈ తరుణంలో వారికి అండగా నిలవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా నిర్మాణ రంగ కార్మికులందరికీ వైద్య పరీక్షలు చేపట్టారు.
ప్రస్తుతం ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రాలను విస్తరిస్తుండటంతో వివిధ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. పురపాలికల్లో బహుళ అంతస్తుల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. స్థానికంగా సరిపడా దొరక్క వేరే జిల్లాల నుంచి రప్పించి పనులు సాగించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు కార్మికుల కొరత వేధిస్తోంది. వికారాబాద్ జిల్లాలో పరిగి, కొడంగల్ తదితర చోట్ల నుంచి హైదరాబాద్ వంటి మహానగరాలకు తరలివెళ్లి కూలీ పనులు చేస్తున్నారు. ఇలాంటి వారందరికీ అవసరమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చేగుంటలో ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు
23 రకాలు..
భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలిలో నమోదైన కార్మికులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే సదరు ప్రక్రియ ప్రారంభమైంది. రక్తపోటు, రక్త చక్కెర, చెవి, కంటి, రక్త, ఊపిరితిత్తుల పనితనం తదితర 23 రకాల పరీక్షలు చేస్తున్నారు. గుండె సంబంధ సమస్యల్ని గుర్తించేందుకు ఈసీజీ సైతం తీస్తారు. అయితే ఆధార్ కార్డు, నిర్మాణరంగ కార్మికుల కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించారు. అనుభవజ్ఞులైన వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. సిద్దిపేట జిల్లాలో ఏప్రిల్ నుంచి మొదలుపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మెదక్ జిల్లాలోనూ ఈ నెల తొలి వారంలో షురూ కానుంది. వికారాబాద్లో శిబిరాల నిర్వహణకు ప్రణాళిక తయారు చేశారు.
కార్మికుల చెంతకే..
కార్మికులకు ఇబ్బందులు లేకుండా వారి సొంత గ్రామాల్లోనే శిబిరాలు నిర్వహించనున్నారు. నిర్మాణ కార్మికుల కార్డులు ఎక్కువగా ఉన్న గ్రామాల జాబితాను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఓవైపు పరీక్షలు చేయడంతోపాటు కార్డులు సైతం అందజేయనున్నారు. స్కోప్ స్వచ్ఛంద సంస్థ సైతం కార్మికుల వద్దకు వెళ్లి పరీక్షించేందుకు ముందుకొచ్చింది. దీనిపై గత జనవరి 31న సంబంధిత అధికారులతో వర్క్షాప్ సైతం నిర్వహించింది. విధి విధానాలు ఖరారు చేసింది.
సలహాలు, సూచనలు..సిఫారసు
సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫలితాల ఆధారంగా కార్మికులకు వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తారు. చికిత్సల అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రులకు సిఫారసు చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవల సద్వినియోగంపై అవగాహన కల్పిస్తారు.
పరీక్షలు నిర్వహిస్తూ.
ప్రత్యేక ఆసుపత్రులు ఉంటే మేలు
నిర్మాణరంగ కార్మికుల్లో ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పనిచేసే ప్రదేశాల్లో సరైన వసతులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. చర్మ వ్యాధులు, శ్వాస సంబంధ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఆరోగ్య పరీక్షల నిర్ణయం హర్షణీయమని, చికిత్సల కోసం ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటుచేస్తే సౌకర్యంగా ఉంటుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా కార్మికులు (వేలల్లో..)
సంగారెడ్డి 46
సిద్దిపేట 65
మెదక్ 22
వికారాబాద్ 39
సద్వినియోగం చేసుకోవాలి
యాదయ్య, సహాయ కార్మిక అధికారి, సంగారెడ్డి
సంపూర్ణ ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని నిర్మాణరంగ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటికే అనంతసాగర్, తాడ్మనూరు, మర్వెల్లి గ్రామాల్లో శిబిరాలు పూర్తిచేశాం. పరీక్షలు చేసుకోవడం ద్వారా సమస్యలు ఏమైనా ఉంటే ముందే గుర్తించి జాగ్రత్త పడేందుకు వీలుంటుంది. సీఎస్సీ హెల్త్కేర్ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహీర్లో యువకుడి దారుణ హత్య
[ 23-04-2024]
కోహీర్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి దాటాక దాడి చేసి హత్య చేశారు. -
మెదక్ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?
[ 23-04-2024]
అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
[ 23-04-2024]
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
కాంగ్రెస్ది అవినీతి, కుటుంబ పాలన
[ 23-04-2024]
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఏడు నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి సోమవారం ఏడుగురు నామినేషన్లు వేశారు. తెలంగాణ రాజ్య సమితి నుంచి తుపాకుల మురళీకాంత్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మైసన్గారి సునీల్ నామపత్రాలను దాఖలు చేశారు. -
భాజపా దుష్ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 23-04-2024]
భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో భాజపా సాగిస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, గోబెల్ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
చితికిపోతున్న.. చిరు వ్యాపారులు
[ 23-04-2024]
జిల్లాలోని పురపాలికల్లో వీధి వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణం ప్రతిపాదనల దశ దాటడం లేదు. మెదక్లో నిర్మాణం చేపట్టినా ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. -
విజ్ఞాన నేస్తం.. మార్గదర్శనం
[ 23-04-2024]
పుస్తకం.. సమస్త విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. మనిషిని మనీషిగా మార్చేందుకు బాటలు వేస్తుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అంటూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. -
అటు ఇటు మారి.. భువనగిరిలో చేరి..
[ 23-04-2024]
పార్లమెంట్ నియోజకవర్గాలు ఆవిర్భావమై దాదాపు ఏడు దశాబ్దాలు కాగా ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాలకు మారడం గమనార్హం. పునర్విభజన జరిగినప్పుడల్లా పార్లమెంటరీ నియోజకవర్గం మారింది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు ఇదే తేడా..
[ 23-04-2024]
ఎలక్టాన్రిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబరు దీనిపై కనిపిస్తాయి. అది కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది. -
లంచం కేసులో ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 23-04-2024]
లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రజాచైతన్యంలో గ్రంథాలయాలు కీలకం
[ 23-04-2024]
ప్రజాచైతన్యానికి ఆ నాటి గ్రంథాలయాలు కీలకంగా పనిచేశాయని.. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తనాన్ని మట్టుబెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆచార్య కోదండరామ్ అన్నారు. -
ఓటర్లకు చేరువ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
పురపాలికల్లో పట్టు.. విజయానికి మెట్టు
[ 23-04-2024]
మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకొంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. -
ఈసారి అవకాశం ఇవ్వండి
[ 23-04-2024]
భారాస అభ్యర్థి వినోద్కుమార్, భాజపా అభ్యర్థి బండి సంజయ్లను ఒక్కోసారి గెలిపించిన కరీంనగర్ లోక్సభ ఓటర్లు, ఈసారి తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసిన వెలిచాల రాజేందర్రావు కోరారు. -
విత్తనోత్పత్తికి అనుకూలం.. ప్రోత్సహించాల్సిన అవసరం
[ 23-04-2024]
వ్యవసాయంలో కీలకమైన విత్తనాలను కర్షకులు సేకరించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడి భూముల్లో విత్తితే చివరికి పంట ఎదుగుతుందో లేదోననే అనుమానం.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?