logo

కడుపునొప్పి తాళలేక కూలీ ఆత్మహత్య

కడుపునొప్పి తాళలేక కూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట గ్రామీణ మండలం పుల్లూరులో శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 01 Apr 2023 01:41 IST

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: కడుపునొప్పి తాళలేక కూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట గ్రామీణ మండలం పుల్లూరులో శుక్రవారం చోటుచేసుకుంది. సిద్దిపేట గ్రామీణ ఠాణా ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి వివరాలు తెలిపారు. గ్రామానికి చెందిన మామిడిపల్లి రాజు(43) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. గురువారం రాత్రి అందరూ భోంచేసి పడుకున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు కుటుంబ సభ్యులు చూసేసరికి ఇంటి వెనుక రేకుల షెడ్‌లో ఉరి వేసుకున్న రాజు కనిపించాడు. వెంటనే వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. అతడికి భార్య నీల, కుమారుడు లోకేశ్‌ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని