నేర వార్తలు
బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రథమ అదనపు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని ఏసీపీ రమేశ్ శుక్రవారం గజ్వేల్లో తెలిపారు.
బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష
గజ్వేల్ గ్రామీణ, జగదేవపూర్, న్యూస్టుడే: బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రథమ అదనపు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని ఏసీపీ రమేశ్ శుక్రవారం గజ్వేల్లో తెలిపారు. జగదేవపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(4)కు చాక్లెట్లు, బిస్కెట్ల ఆశ చూపి తిమ్మాపూర్ గ్రామవాసి పోసానిపల్లి రమేశ్ తరచూ లైంగికంగా వేధించేవాడు. 18 నవంబరు 2021న బాలిక అస్వస్థతకు గురైంది. ఆరు రోజుల తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగదేవపూర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సీపీ శ్వేత చొరవతో, కేసును వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక న్యాయస్థానం విచారణ నిర్వహించింది. నిందితుడికి శిక్ష విధించింది. ఇందుకు కృషిచేసిన పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.
అడవిలో మహిళ అస్థిపంజరం
పూడూరు, న్యూస్టుడే: పూడూరు మండలం సోమన్గుర్తి అటవీ ప్రాంతంలో మహిళ అస్థిపంజరం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. సోమన్గుర్తికి చెందిన కూలీలు శుక్రవారం ఉదయం ఉపాధి పనులు చేసేందుకు వికారాబాద్ అటవీ ప్రాంతం వైపు వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, అస్థిపంజరాన్ని గుర్తించారు. వీఆర్ఏ రామకృష్ణ ఇచ్చిన సమాచారంతో డీఎస్పీ కరుణాసాగర్రెడ్డి, సీఐ వెంకటరామయ్య, తహసీల్దారు మోహన్, ఎస్సై విఠల్రెడ్డి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాజు ముక్కలు, మద్యం సీసా, అగ్గిపెట్టెను గుర్తించారు. వారం రోజుల కిందట మహిళను హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని, లేదా ఎక్కడో చంపి ఇక్కడ దహనం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని మహిళగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేసు భయంతో ప్రాణం తీసుకున్నాడు!
జహీరాబాద్ అర్బన్, న్యూస్టుడే: ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తనపై కేసు నమోదు అవుతుందేమోననే భయంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కర్ణాటకలోని కలబురిగి జిల్లా చించోళి తాలూకా కుంచారం గ్రామానికి చెందిన గడ్డమీది శ్రీకాంత్(28) ద్విచక్ర వాహనంపై జహీరాబాద్ వస్తుండగా గురువారం రాత్రి పట్టణంలోని రాంనగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. తదుపరి ఆయన గతంలో పనిచేసిన చెన్నారెడ్డినగర్ కాలనీ వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లి అక్కడే నిద్రించాడు. భయాందోళనలో ఉన్న శ్రీకాంత్ ప్రమాద విషయాన్ని కుటుంబీకులకు చెప్పి వాహన మరమ్మ, పరిహారం నిమిత్తం డబ్బులు కావాలని అడగడంతో ‘నువ్వే చూసుకోవాలని’ మందలించారు. ఈ ఘటనలో తనపై పోలీసు కేసు అవుతుందనే భయంతో అదే రాత్రి వాటర్ ప్లాంట్ షెడ్డుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవపరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు.
కోనేరులో మునిగి మహిళ మృతి
యాలాల, న్యూస్టుడే: మండలంలోని జుంటిపల్లి సీతారామచంద్రస్వామి జాతరలో శుక్రవారం ఉదయం విషాదం నెలకొంది. ఎస్సై అరవింద్ తెలిపిన ప్రకారం.. బొంరాస్పేట మండలం తుంకిమెట్లకు చెందిన భీమమ్మ(40) గురువారం రాత్రి రేగడిమైలారానికి చెందిన చెల్లెలు సత్యమ్మతో కలిసి జుంటిపల్లి జాతరకు వచ్చారు. రాత్రి ఆలయం వద్దే ఉన్నారు. శుక్రవారం ఉదయం గుట్ట కింద ఉన్న కోనేరులో స్నానానికని దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు భీమమ్మ మునిగిపోయింది. సత్యమ్మ కేకలు వేయడంతో స్థానికులు ఆమెను బయటికి తీసి, వెంటనే తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందిందని నిర్ధరించారు. సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భీమమ్మకు భర్త రాజు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నీట మునిగి యువకుడు మృతి
కల్హేర్: ఎద్దుల బండిని శుభ్రం చేసేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి మృతిచెందాడు. కల్హేర్ ఎస్సై ప్రశాంత్ వివరాల ప్రకారం.. నిజాంపేట్ మండలంలోని రాంరెడ్డిపేట్ గ్రామానికి చెందిన దిడ్డి బ్యాతయ్య(23) గ్రామంలో జాతర సందర్భంగా ఎద్దుల బండిని శుభ్రం చేసేందుకు గ్రామస్థులతో కలిసి నిజాంసాగర్కు వెళ్లాడు. తిరుగు జలాల్లో బండిని శుభ్రం చేశాడు. తర్వాత స్నానం చేసేందుకు కొద్దిదూరం వెళ్లి కాలుజారి గుంతలో పడిపోయాడు. తోడుగా వచ్చినవారు రక్షించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి సోదరుడు ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఖాజీపేటలో మరొకరు మృతి
నర్సాపూర్ రూరల్: జీవాల దాహం తీర్చేందుకు కుంటలోకి తీసుకెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాలు.. నర్సాపూర్ మండలం ఖాజీపేటకు చెందిన ప్రభాకర్(38), రుక్మిణి దంపతులకు ఓ కుమారుడున్నాడు. ప్రభాకర్ పాలు విక్రయిస్తాడు. శుక్రవారం మధ్యాహ్నం గేదెలను తాబేలు కుంటకు నీళ్లు తాగించేందుకు తీసుకెళ్లాడు. అవి ఎంతకీ ఒడ్డుకు రాకపోతుండడంతో కుంటలోకి దిగి మునిగి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు కుటుంబీలకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. చెలరేగిన మంటలు
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగు రోడ్డుపై పటాన్చెరు ఎగ్జిట్ సమీపంలో ఆగి ఉన్న లారీని... -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు