అన్నదాతల ఆవేదన
లారీల కొరత తీర్చి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలంటూ కౌడిపల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రైతులు ధర్నా చేశారు.
లారీల కొరత తీర్చాలని రహదారిపై బైఠాయింపు
కౌడిపల్లి మండల కేంద్రంలో నిరసన తెలుపుతున్న రైతులు
కౌడిపల్లి, న్యూస్టుడే: లారీల కొరత తీర్చి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలంటూ కౌడిపల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రైతులు ధర్నా చేశారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులైన ఏసోబ్ ఆధ్వర్యంలో ప్రభాకర్, విఠల్, ఇలియాజ్, శేఖర్లతో పాటు మహిళా రైతులు రహదారిపై బైఠాయించారు. కేంద్రానికి ధాన్యం తెచ్చి నెలరోజులైనా ఇంతవరకు కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ను పెట్టి ధాన్యం బస్తాలను ఉంచారు. ధాన్యాన్ని తగలబెట్టి నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా భాజపా జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, మండల అధ్యక్షులు రాకేశ్లు బైఠాయించారు. సుమారు గంటపాటు ఆందోళన చేయడంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. లారీలను రప్పించి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని తహసీల్దార్ కమలాద్రి, ఎస్ఐ శివప్రసాద్రెడ్డిలు హామీ ఇవ్వడంతో రైతులు విరమించారు.
శివ్వంపేట: శివ్వంపేట మండలం శభాష్పల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం తరలించేందుకు లారీలు పంపించాలని రైతులు బుధవారం నర్సాపూర్-తూప్రాన్ రహదారిపై ధర్నా చేశారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులు రైతులతో చరవాణి ద్వారా మాట్లాడి లారీలు పంపిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
రామాయంపేట: వర్షాకాలం సమీపిస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడంలేదని, మూడు రోజులుగా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రామాయంపేట మండల పరిధి ప్రగతి ధర్మారం గ్రామస్థులు రామాయంపేట-గజ్వేల్ రహదారిపై బైఠాయించారు. ధాన్యాన్ని రహదారిపై పోసి నిప్పంటించారు. వాహనాలు వెళ్లకుండా రహదారిపై కట్టెలు అడ్డుగా వేశారు. సుమారు రెండు గంటల పాటు రహదారిపై బైఠాయించారు. సుమారు 70 మంది రైతుల ధాన్యాన్ని తూకం వేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన సుమారు 5వేల బస్తాలు కేంద్రంలో నిల్వ ఉన్నాయని, లారీలు సకాలంలో రావడంలేదన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించి పంపివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. చెలరేగిన మంటలు
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగు రోడ్డుపై పటాన్చెరు ఎగ్జిట్ సమీపంలో ఆగి ఉన్న లారీని... -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు