వేలం పాడారు.. తీసుకోకుండా వదిలేశారు!
వేలంలో పోటీపడి దుకాణాలను దక్కించుకున్నారు. ఇప్పుడు మాకు వద్దు బాబు అంటూ వదిలేశారు. దీనివల్ల ఏడాదిగా ఆదాయం కోల్పోతుంది. చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో దుకాణ సముదాయాలను రెండేళ్ల క్రితం నిర్మించారు.
ఏడాదిలో రూ.7.50 లక్షల ఆదాయం కోల్పోయిన ఏఎంసీ
చేగుంటలో వృథాగా దుకాణాలు
న్యూస్టుడే, చేగుంట: వేలంలో పోటీపడి దుకాణాలను దక్కించుకున్నారు. ఇప్పుడు మాకు వద్దు బాబు అంటూ వదిలేశారు. దీనివల్ల ఏడాదిగా ఆదాయం కోల్పోతుంది. చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో దుకాణ సముదాయాలను రెండేళ్ల క్రితం నిర్మించారు. రూ.55 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టి వృథాగా వదిలేశారు. 2022 మే 24న మార్కెటింగ్ శాఖ అధికారులు బహిరంగ వేలం వేశారు. వాటిని కొందరు అధిక మొత్తాలకు దక్కించుకున్నారు. కానీ ఆ దుకాణాలను తీసుకోవటానికి వారు ముందుకు రావడంలేదు. దీనివల్ల ప్రతి నెల ఏఎంసీకి వచ్చే అద్దె రాకుండా పోయింది.
చేగుంటలోని మెదక్ ప్రధాన రహదారి వైపు తొమ్మిది, వెనకవైపు తొమ్మిది దుకాణాలను నిర్మించారు. కానీ వాటిని కేటాయించేందుకు కాలయాపన చేస్తూ వచ్చారు. చివరకు మేలో బహిరంగ వేలం వేయగా మెదక్ రోడ్డు వైపు ఉన్న దుకాణాలను దక్కించుకునేందుకు చాలా మంది పోటీపడ్డారు. వెనకవైపు కేవలం ఒకే దుకాణం వేలంలో వెళ్లింది. కానీ అధికారులు మాత్రం వాటిని దక్కించుకున్నవారికి మొదట కేటాయించలేదు. కేవలం ఒకే దుకాణం కేటాయించారు. విద్యుత్తు సౌకర్యం లేని కారణంగా వేలంలో దక్కించుకున్నవారు తీసుకోవటానికి ఆసక్తి చూపించలేదు. విద్యుత్తు సౌకర్యం ఏర్పాటుకు ఐదారు నెలలు పట్టింది. ఇప్పుడు వారు తీసుకోవటానికి ముందుకు రావటంలేదు. దీనివల్ల ప్రతి నెల దాదాపుగా రూ.70 వేల వరకు ఆదాయం ఏఎంసీ కోల్పోతుంది. ఇలా ఏడాదిలో ఇప్పటివరకు సుమారుగా రూ.7.50 లక్షల వరకు ఆదాయం కోల్పోయింది. వేలం పాడి దక్కించుకున్న వారు రూ.15 వేలు ధరావత్తు చెల్లించారు. దుకాణాలను తీసుకోకపోతే ఆ సొమ్ము ఏఎంసీకే ఉండిపోతుంది. ప్రస్తుతం ఒకే దుకాణం రూ.6700 అద్దెకు కొనసాగుతుంది. మిగతావి వృథాగా పడిఉన్నాయి. ఇప్పటికైనా వీటికి మళ్లీ టెండర్లు పిలిచి కేటాయించాల్సిన అవసరం ఉంది.
ముందుకు రావటం లేదు
మొదట్లో విద్యుత్తు వసతి లేక దుకాణాల కేటాయింపులో ఆలస్యం జరిగింది. ఇప్పుడు విద్యుత్తు వసతి కల్పించినా తీసుకోవటానికి ముందుకు రావటంలేదు. ఫోన్లో తెలిపినా ఆసక్తి చూపించడంలేదు. త్వరలోనే నోటీసులు ఇస్తాం. అయినా స్పందించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తిరిగి టెండర్లు పిలిపించే ఏర్పాట్లు చేస్తాం.
ఈశ్వర్కుమార్, ఏఎంసీ సహాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్