హరిత లక్ష్యం మొక్కలు సిద్ధం!
పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో వన నర్సరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీ నిర్వహణకు ప్రభుత్వం రూ.1.65 లక్షలు ఖర్చు చేస్తోంది.
జిల్లాలో 50 లక్షలకు పైగా నాటేందుకు కార్యాచరణ
హనుమాన్నగర్ నర్సరీలో మొక్కలు
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్ : పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో వన నర్సరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీ నిర్వహణకు ప్రభుత్వం రూ.1.65 లక్షలు ఖర్చు చేస్తోంది. వానాకాలం ఆరంభంలో ఊరూరా ఉద్యమంలా మొక్కలు నాటి సంరక్షించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం తొమ్మిదో విడత హరితహారాన్ని జూన్, జులైలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కథనం.
పండ్ల రకాలకు ప్రాధాన్యం
జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 639 పల్లెల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్) అమలవుతుంది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో వన నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారానికి మొక్కలు సిద్ధం చేస్తున్నారు. అమీన్పూర్ మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలు కావడం లేదు. ఇక్కడ ఇతర నిధులు వెచ్చిస్తున్నారు. నర్సరీల్లో నిత్యం నీటి తడులు అందించడంతో పాటు.. ఎండకు ఎండిపోకుండా షెడ్ నెట్లు ఏర్పాటు చేశారు. పండ్ల మొక్కలు అధికంగా నాటేలా ప్రాధాన్యం ఇస్తున్నారు. రావి, జామ, అల్ల నేరేడు, దానిమ్మ, నిమ్మ, బొప్పాయి, చింత, తుమ్మతో పాటు గుల్ మోహర్ తదితర 20 రకాల మొక్కలు పెంచుతున్నారు.
వచ్చే ఏడాదికి..
హరితహారం అమలులో భాగంగా వచ్చే ఏడాది(2024)కి ఇప్పటి నుంచే మొక్కల సంరక్షణకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 35,46,500 మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని ఇప్పటికే ఖరారు చేసింది. ఈ ఏడాది నాటగా మిగిలిన వాటితో పాటు.. నర్సరీల్లో కొత్తగా సిద్ధం చేయనున్నారు.
ఖాళీ ప్రదేశాలు, రహదారుల వెంట..
ఈ ఏడాది తొమ్మిదో విడత హరితహారం కింద జిల్లాలో 50,61,481 లక్షలు నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందుకోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో 7800కు పైగా నాటేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ప్రజలు ఇంటి ఆవరణలో నాటేందుకు పూలు, పండ్ల రకాలను ఆరు చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా భారీగా గ్రామాల్లో అంతర్గత రహదారులకు ఇరువైపులా, విద్యాసంస్థలు, చెరువులు, కుంటల కట్టలపైనా నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో పాటు ‘వృక్షమాల’ కార్యక్రమం కింద సింగూరు, మంజీరా, నల్లవాగు, నారింజ ప్రాజెక్టు సమీపం, పరీవాహక ప్రాంతాల్లో మొక్కలు నాటి పెంచనున్నారు. ‘సంపద వనమాల’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వసతి గృహాల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో మునగ, ఇతర తోటలు పెంచి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా చూడనున్నారు.
విత్తనాలు మొలకెత్తకుంటే మళ్లీ నాటించాం
ప్రభుత్వం తొమ్మిదో విడత హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ఇందుకోసం నర్సరీల్లో మొక్కల పెంపకంపై దృష్టి సారించాం. తొలుత విత్తనాలు మొలకెత్తక పోవడంతో మళ్లీ నాటించాం. వాటి సంరక్షణకు వేసవిలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా నీడ కల్పించేలా షేడ్ నెట్లు పంపిణీ చేశాం. జూన్, జులై నెలల్లో నాటేందుకు సిద్ధం చేస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఏపీఓలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సాంకేతిక సహాయకుల పర్యవేక్షణలో మొక్కల సంరక్షణ కొనసాగుతుంది.
మణికుమార్, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా