ప్రతిపాదనలకే పరిమితం
ఇది పోటీ ప్రపంచం. చదువు ఒక్కటే సరిపోదు. అదనపు అర్హతలు ఉంటేనే జీవితంలో స్థిరపడేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుడుతోంది.
ఇంటర్ కళాశాలల్లో అమలుకు నోచని ఎన్సీసీ
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: ఇది పోటీ ప్రపంచం. చదువు ఒక్కటే సరిపోదు. అదనపు అర్హతలు ఉంటేనే జీవితంలో స్థిరపడేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేషనల్ కేడెట్ కార్ప్స్(ఎన్సీసీ)ని ప్రారంభించాలని రెండేళ్ల కిందట నిర్ణయించింది. జిల్లా అధికారులు ప్రతిపాదనలు సైతం పంపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం తరగతులు నేటి నుంచి మొదలు కానుండగా ఎన్సీసీ ప్రారంభంపై ఇప్పటి వరకు ఆదేశాలు అందని తీరుపై కథనం.
500 మంది కంటే ఎక్కువ ఉంటేనే..
జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో 8వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కళాశాలల్లో ఎన్సీసీని ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపాలని 2021 ఆగస్టులో ఇంటర్బోర్డు జిల్లా యంత్రాంగానికి ఉత్తర్వులు జారీచేసింది. ఎన్సీసీని ప్రారంభించాలంటే సంబంధిత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య 500కంటే ఎక్కువ ఉండటంతోపాటు అదే కళాశాలకు చెందిన ఓ రెగ్యులర్ అధ్యాపకుడు ఎన్సీసీ శిక్షణ పొందాలి. విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా జహీరాబాద్, సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల, నారాయణఖేడ్, కోహీర్, రామచంద్రాపురం కళాశాలల్లో ఎన్సీసీకి ప్రతిపాదించారు. రెండేళ్లు అవుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం గమనార్హం.
విద్యార్థులకు ప్రయోజనం: పౌరులందరూ ఐక్యంగా ఉంటే ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుంటుంది. క్రమ శిక్షణ వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. లక్ష్యాల వైపు అడుగులు వేయిస్తుంది. అందుకే ఈ రెండింటినీ యువత వీడొద్దు. ఇదే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే నేషనల్ కేడెట్ కార్ప్స్. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్సీసీని ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు వీలుంటుంది. విద్యార్థులు ఇంటర్ విద్య చదువుతూనే ఎన్సీసీలోనూ రాణించడం ద్వారా అదనపు ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికే ఉన్నత విద్యలో చేరాలనుకునేవారు ఎన్సీసీ ‘సి’ సర్టిఫికెట్ను ఉపయోగించుకుంటున్నారు. ఇంటర్లో ఎన్సీసీలో చేరిన వారు డిగ్రీలోనూ కొనసాగించేందుకు వీలుంటుంది. డిగ్రీ స్థాయిలో ఎన్సీసీని కోర్సుగా గుర్తించాలని యూజీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఇతర సబ్జెక్టుల మాదిరిగానే క్రెడిట్లు(మార్కులు) పొందేందుకు వీలుంటుంది. ఎన్సీసీ కేడెట్లకు ఇతర విద్యార్థులకంటే అధిక క్రెడిట్లు దక్కించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇంటర్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా..
ఇంటర్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా గతంలో ఎన్సీసీ ప్రారంభించేందుకు అర్హత ఉన్న కళాశాల వివరాలతో ప్రతిపాదనలు పంపించాం. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించగానే ఎన్సీసీ తరగతులు ప్రారంభమవుతాయి. దేశభక్తిని చాటేందుకు విద్యార్థులకు ఎన్సీసీ వేదిక అవుతుంది. ఎన్సీసీ పూర్తిచేస్తే విద్యార్థులకు అదనపు అర్హతగా ఉంటుంది.
గోవిందరామ్, జిల్లా ఇంటర్ విద్యాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ, కేసీఆర్ మెదక్ ప్రాంతాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు: రేవంత్రెడ్డి
[ 20-04-2024]
ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్