పదేళ్లలో వందేళ్ల అభివృద్ధి
సిద్దిపేట ప్రగతిపై ప్రతి ఒక్కరు గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాలని, పదేళ్లలో వందేళ్ల అభివృద్ధిని చేసి చూపామని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం
మాట్లాడుతున్న మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, న్యూస్టుడే: సిద్దిపేట ప్రగతిపై ప్రతి ఒక్కరు గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాలని, పదేళ్లలో వందేళ్ల అభివృద్ధిని చేసి చూపామని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఇంట్లో పెళ్లి మాదిరిగా పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని సిద్దిపేట నియోజకవర్గంలో జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రంగమేదైనా పదేళ్లలో గుణాత్మక మార్పును సాధించామన్నారు. దాని వెనుక తీవ్రమైన ప్రయత్నం, కృషి ఉందన్నారు. నాటితో పోల్చితూ నేటి ప్రగతిని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. గోదావరి నీళ్లు దరిచేరాయని, సిద్దిపేట జిల్లా, సుడా, వైద్య కళాశాల, జాతీయ రహదారి, రింగు రోడ్డు, రైలు మార్గం ఏర్పాటు, తదితర ఎన్నో వాటిని సాకారం చేసుకున్నట్లు వివరించారు. ఈ ప్రాంతం అభివృద్ధికి అధ్యయన కేంద్రంగా మారిందని, కేరళ నుంచి ఈ నెల 11, 12 తేదీల్లో అక్కడి పురపాలిక అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటనకు రానున్నారని తెలిపారు. పదేళ్ల కిందట జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగయ్యేదని, నేడు ఆ సంఖ్య 7 లక్షలకు చేరిందన్నారు. చెల్లింపులు రూ.33 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరిందన్నారు.
ఇంకా వరి కోతలా!
నిజామాబాద్, సూర్యాపేట, హుజూరాబాద్ ఇతర ప్రాంతాల్లో కోతలు, కొనుగోళ్లు పూర్తయ్యాయని, జిల్లాలో మాత్రం ఇంకా కొన్ని ప్రాంతాల్లో కోతలు జరగకపోవడం శోచనీయమన్నారు. ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించాలని, సకాలంలో సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యమం, అభివృద్ధితో పాటు మార్పులోనూ ముందుండాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు అంచనా ఉందన్నారు. జూన్ 9న కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం ఇచ్చే కార్యక్రమాన్ని, అర్హులకు ఇళ్ల పట్టాలు, రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ప్రతి గ్రామంలో పెద్దసంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంపై ఆయా మండలాల బాధ్యులను మంత్రి మందలించారు. జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, బల్దియా అధ్యక్షురాలు మంజుల, కమిషనర్ సంపత్కుమార్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం తదితరులు ఉన్నారు.
* దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముద్రించిన ప్రచార గోడపత్రికలను మంత్రి హరీశ్రావు, ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్రెడ్డి బుధవారం గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఆవిష్కరించారు. ఆటోడ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాగర్ల బాలరాజు, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.