logo

కదులు బొమ్మాళీ కదులు!

అక్కన్నపేటలో హుస్నాబాద్‌ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మొరాయించింది. గురువారం ఉదయం 8 గంటలకు హుస్నాబాద్‌ నుంచి అక్కన్నపేట మీదుగా హైదరాబాద్‌ జగద్గిరిగుట్టకు మినీబస్సు బయలుదేరింది.

Published : 02 Jun 2023 01:55 IST

అక్కన్నపేటలో హుస్నాబాద్‌ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మొరాయించింది. గురువారం ఉదయం 8 గంటలకు హుస్నాబాద్‌ నుంచి అక్కన్నపేట మీదుగా హైదరాబాద్‌ జగద్గిరిగుట్టకు మినీబస్సు బయలుదేరింది. అందులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు అక్కన్నపేటలో ఆగిపోయింది. డ్రైవర్‌ ఎంత ప్రయత్నించినా కదలలేదు. ప్రయాణీకులు, గ్రామస్థులు బస్సును నెట్టినా ఫలితం లేదు. డిపో మేనేజర్‌కు ఈ విషయాన్ని డ్రైవర్‌ తెలిపారు. వేరే బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను పంపించారు. డిపో నుంచి నిపుణులు వచ్చి వాహనాన్ని తరలించారు.

న్యూస్‌టుడే, అక్కన్నపేట(హుస్నాబాద్‌ గ్రామీణం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని