దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. పదేళ్లలో జిల్లాలో జరిగిన ప్రగతిని పల్లెల్లో వివరించేందుకు కార్యాచరణ రూపొందించారు.
కలెక్టరేట్ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న పాలనాధికారి రాజర్షిషా
మెదక్, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. పదేళ్లలో జిల్లాలో జరిగిన ప్రగతిని పల్లెల్లో వివరించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఆయా శాఖల ద్వారా సాధించిన విజయాలను తెలియజేసేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఈనెల 2వ తేదీ నుంచి 22 వరకు నిర్వహించనున్న వేడుకలను పకడ్బందీగా చేపట్టేందుకు ఆయా శాఖల అధికారులకు మండల, జిల్లా స్థాయిలో బాధ్యతలను అప్పగించారు. పాలనాధికారి రాజర్షిషా పలు మార్లు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులతో సమీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని మెదక్లో సమీకృత కలెక్టరేట్, మున్సిపల్, పోలీస్స్టేషన్, ఖిల్లాను విద్యుత్తుదీపాలతో అలంకరించారు.
ముఖ అతిథిగా మంత్రి తలసాని
స్థానిక కలెక్టరేట్లో జరిగే వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. చిన్నశంకరంపేటలోని అమరు వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 9గంటలకు కలెక్టరేట్కు చేరుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రి రాకను పురస్కరించుకొని పాలనాధికారి రాజర్షిషా, అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్, ఇన్ఛార్జీ ఎస్పీ సింధుశర్మ గురువారం కలెక్టరేట్లో ఏర్పాట్లను పరిశీలించారు.
దళితబంధు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
పాపన్నపేట: ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పాలనాధికారి రాజర్శిషా అన్నారు. గురువారం మండల పరిధి పొడ్చన్పల్లి తండా వద్ద దళిత బంధు ద్వారా ఏర్పాటు చేసుకున్న అబ్లాపూర్ గ్రామానికి చెందిన కిష్టయ్య సిమెంటు దుకాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కొల్చారం: ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు వేదికల్లో రైతు దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని పాలనాధికారి రాజర్షిషా అన్నారు. గురువారం కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి రైతు వేదికలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సదర్భంగా వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ వేదిక పరిసరాలు శుభ్రపరచాలని, వేదికను అలంకరించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!