చేప పిల్లల పంపిణీ లక్ష్యం 4.27 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తోంది. ఏటా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది.
ఈ నెలాఖరుకు టెండర్లు పూర్తి
గతేడాది కోమటి చెరువులో చేప పిల్లలను వదులుతున్న మంత్రి హరీశ్రావు, నాయకులు, అధికారులు
న్యూస్టుడే, సిద్దిపేట అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తోంది. ఏటా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది. జిల్లాలో మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో చేప పిల్లల పంపిణీ చేపట్టేందుకు మత్స్య శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టారు. జిల్లాలో రంగనాయక, కొండపోచమ్మ, కొమురవెల్లి మల్లన్న సాగర్ జలాశయాలు... 1637 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో 4.27 కోట్ల చేప పిల్లలను వదలాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు రూ.4.50 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు. 35-40 ఎంఎం పరిమాణం ఉన్న 1.64 కోట్లు, 80-100 పరిమాణం ఉన్న 2.63 కోట్ల పిల్లలను నీటివనరుల్లో వదలనున్నారు. ప్రధానంగా రౌ, బంగారు తీగ, బొచ్చె రకాలను పెంచనున్నారు. 283 మత్స్యకార సంఘాలు ఉండగా వాటిలో మొత్తం 23,500 మంది సభ్యులు ఉన్నారు. గతేడాది 3.92 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశారు.
ఉత్పత్తి క్షేత్రాల పరిశీలన
ఉచితంగా చేప పిల్లల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు టెండర్లు పిలిచారు. ఈ నెల 30న టెండర్ల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. అనంతరం చేప పిల్లల ఉత్పత్తి క్షేత్రాలను పరిశీలిస్తారు. అక్కడ విత్తన రకాలు, వాటి పరిమాణం, నాణ్యత బాగుంటే ధర నిర్ణయించి ఒప్పందం చేసుకుంటారు. ప్రక్రియ పూర్తయ్యాక చెరువుల్లో వదులుతారు.
నీటి లభ్యత ఆధారంగా సరఫరా
మూడు ప్రధాన జలాశయాలు, మిగతా చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. టెండరు ప్రక్రియ ప్రారంభించాం. పూర్తి కాగానే చెరువుల్లో నీటి లభ్యత ఆధారంగా ఉచితంగా సరఫరా చేస్తాం.
మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ, కేసీఆర్ మెదక్ ప్రాంతాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు: రేవంత్రెడ్డి
[ 20-04-2024]
ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?