దర్జాగా స్వాహా
చెరువులు, కుంటలు కనిపిస్తే చాలు రియల్టర్లు, భూస్వాములు, పరిశ్రమల యాజమాన్యాలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
చెరువులు, కుంటల భూములు అన్యాక్రాంతం
మాసాయిపేటలోని మైసమ్మ చెరువు
న్యూస్టుడే, వెల్దుర్తి (మాసాయిపేట): చెరువులు, కుంటలు కనిపిస్తే చాలు రియల్టర్లు, భూస్వాములు, పరిశ్రమల యాజమాన్యాలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 44వ జాతీయ రహదారిలో ఉండే మాసాయిపేట మండలంలో చెరువులు, కుంటల భూములు కబ్జాకు గురవుతుండటం గమనార్హం. కబ్జా అయిన శిఖం భూములు ఎకరా రూ.కోటి విలువ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం.
ఫిర్యాదు చేస్తున్నా..
మాసాయిపేట మండల కేంద్రం 44వ జాతీయ రహదారికి కూతవేటు దూరంలో విద్యుత్తు ఉపకేంద్రం వెనుక భాగంలో కోరింత కుంట ఉంది. ఈ కుంట కింద 30 ఎకరాల ఆయకట్టు ఉంది. మత్తడి పక్కనే ఉన్న ఓ పరిశ్రమ వారు దర్జాగా కుంట మత్తడిని, శిఖం భూమిని దాదాపు రెండు ఎకరాలు కబ్జా చేసి సిమెంట్ పలకలతో చుట్టూ గోడను నిర్మించారు. ఈ కుంట నిండి మత్తడి పారితే నీళ్లు వెళ్లడానికి ఎలాంటి అవకాశం లేదు. కబ్జా చేసిన శిఖం భూమిలో పండ్ల మొక్కలు పెంచుతున్నారు. కొంత భాగంలో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ ఎకరా భూమి రూ.కోటి విలువ చేస్తుంది. కబ్జా విషయమై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు గత పదేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునే వారులేరని మాసాయిపేట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పునరుద్ధరణ పట్టించుకోక..
మాసాయిపేట గ్రామ పరిధిలో ఏళ్ల క్రితం శిథిలమైన కోటమైసమ్మ చెరువు పునరుద్ధరణను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో 50 ఎకరాల విస్తీర్ణం ఉన్న శిఖంలో చాలా భాగం కబ్జాకు గురైంది. కొందరు స్థిరాస్తి వ్యాపారులు తోటలు పెంచుతున్నారు. చెరువు ఆయకట్టు కాలువను గోశాల పరిసరాల్లో గల ఓ వెంచర్ యజమాని సుమారు ఎకరాల విస్తీర్ణంలో కబ్జా చేసి తారు రోడ్లు, ప్లాట్లు చేయడంతో పాటు చుట్టూ గోడ నిర్మించారు. ఇక్కడ ఎకరా రూ.కోటి ధర పలుకుతోంది. తగు చర్యలు తీసుకొని చెరువును పునరుద్ధరించాలని మాసాయిపేట, లింగారెడ్డిపల్లి గ్రామస్థులు విన్నవిస్తున్నారు.
అడ్డుగా గోడ నిర్మాణం
మాసాయిపేట మండలంలోనే అతి పెద్దదైన రామప్ప చెరువు 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది. చెరువు మత్తడికి ఎదురుగా బఫర్ జోన్లో ఓ తోట యజమాని సిమెంట్ పలకలతో గోడ నిర్మించారు. దీనివల్ల మత్తడిపై నుంచి పారే నీటికి అడ్డంకులు ఏర్పడి చెరువుకే ప్రమాదం పొంచి ఉంది. జాతీయ రహదారి, రైల్వేలైన్ సైతం మునిగే అవకాశం లేకపోలేదు. గోడను నీటి పారుదలశాఖ అధికారులు పరిశీలించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వర్షాకాలం ప్రారంభం కాకముందే కబ్జాదారులపై చర్యలు తీసుకుని జలవనరుల భూములను స్వాధీనం చేసుకోవాలని, కట్టడాలను కూల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కోరింత కుంట శిఖాన్ని కబ్జా చేసి నిర్మించిన గోడ
చర్యలు తీసుకుంటాం
మాసాయిపేట మండలంలోని రామప్ప చెరువు, మైసమ్మ చెరువు, కోరింత కుంటలతో పాటు ఇతర చెరువులు, కుంటలను త్వరలోనే తహసీల్దార్ కార్యాలయ సర్వేయర్, నీటి పారుదల సర్వేయర్తో సంయుక్త సర్వే చేయిస్తాం. కబ్జాదారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కబ్జాకు గురైన శిఖం భూములను, బఫర్ జోన్ భూములను, కాలువల భూములను స్వాధీనం చేసుకుంటాం.
రాజేందర్రావు, నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ, వెల్దుర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తగతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
ద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం