రైలు పట్టాలపై రెండు మృతదేహాలు
తూప్రాన్ పురపాలిక పరిధి బ్రాహ్మణపల్లి వద్ద సోమవారం రైలు పట్టాలపై వంద మీటర్ల దూరంలో రెండు మృతదేహాలు పడిఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కారణాలు వేరు.. ఘటనా స్థలి దాదాపు ఒకటే
తూప్రాన్, న్యూస్టుడే: తూప్రాన్ పురపాలిక పరిధి బ్రాహ్మణపల్లి వద్ద సోమవారం రైలు పట్టాలపై వంద మీటర్ల దూరంలో రెండు మృతదేహాలు పడిఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇరువురు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గుర్తించినా, వారిద్దరికీ ఎలాంటి సంబంధం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఏడాది కిందట తమ్ముడు.. ప్రస్తుతం అన్న
యాదగిరి
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. అంతటితో ఆగకుండా ఏడాది వ్యవధిలో అన్నదమ్ములను బలిగొన్నాయి. ఇద్దరూ దూరం కావడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కామారెడ్డి రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. తూప్రాన్ పురపాలికలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఇప్పలపల్లి యాదగిరి(40), లక్ష్మీ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆదివారం కుటుంబ సభ్యులతో గొడవపడిన యాదగిరి బ్రాహ్మణపల్లికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యానికి బానిసవడం, ఆర్థిక ఇబ్బందులతో యాదగిరి సోదరుడు నర్సింలు సైతం ఏడాది క్రితం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే ఇంట్లో, 14 నెలల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సోదరుడి వైద్య ఖర్చులు భారమై..
నీరుడి ప్రవీణ్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అన్న ప్రాణాలను దక్కించుకునే క్రమంలో చికిత్సకు అయిన ఖర్చులు భారమై తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది. కామారెడ్డి రైల్వే పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన నీరుడి నవీన్ తూప్రాన్లోని వెంకటాపూర్ శివారులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నవీన్, ప్రవీణ్(22)ది ఉమ్మడి కుటుంబం. అన్న వైద్యానికి రూ.4 లక్షల వరకు ఖర్చయింది. అన్నను ఢీకొన్న వాహనం ఆచూకీ లభించక సోదరుడు కలత చెందాడు. ఆర్థిక సమస్యలూ తోడవడంతో మానసికంగా కుంగిపోయిన ప్రవీణ్ ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బ్రాహ్మణపల్లి రైల్వేగేట్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం ప్రాంతంలో ఆ మృతదేహం ప్రవీణ్దిగా గుర్తించారు. పెద్ద కొడుకు తీవ్ర గాయాలతో మంచానికి పరిమితం కాగా చేతికొచ్చిన చిన్న కొడుకు దూరం కావడంతో తల్లి నర్సమ్మ గుండెలవిసేలా రోదించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు