డీలర్ల దురాశ.. కర్షకుల ప్రయాస!
మునిపల్లి మండలం వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తండ్రి ఈనెల 6న ఒక డీలరు వద్ద పత్తి విత్తన ప్యాకెట్లు కొన్నాడు. గరిష్ఠ చిల్లర ధర కంటే రూ.600 ఎక్కువ తీసుకున్నారు.
పత్తి విత్తనాలు కావాలంటే అడిగినంత ఇవ్వాల్సిందే
ఈనాడు, మెదక్:
గజ్వేల్ మండలం రిమ్మనగూడలో పత్తి విత్తనాలు నాటుతున్న మహిళలు
* మునిపల్లి మండలం వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తండ్రి ఈనెల 6న ఒక డీలరు వద్ద పత్తి విత్తన ప్యాకెట్లు కొన్నాడు. గరిష్ఠ చిల్లర ధర కంటే రూ.600 ఎక్కువ తీసుకున్నారు.
* ‘మేం ఎక్కువ ధర చెల్లించే కొన్నాం. కానీ డీలరు గరిష్ఠ చిల్లర ధరనే రసీదులో రాసిచ్చారు. ఇదేంటని అడిగితే.. విత్తనాలు లేవు.. ఇదే ధర ఇష్టం లేకుంటే తీసుకోవద్దన్నారని సదాశివపేట మండలానికి చెందిన ఓ రైతు వాపోయారు.
రైతుల అవసరాన్ని కొందరు డీలర్లు అవకాశంగా మలచుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అందినకాడికి దోచుకుంటున్నారు. పత్తి సాగు చేసే వారి నుంచి కొన్ని కంపెనీల విత్తనాలకు డిమాండ్ అధికంగా ఉంటోంది. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్నారు. ఎవరికి చెప్పినా ప్రయోజనం ఉండదనే నిస్సహాయతో అన్నదాతలు వారు చెప్పిన ధరకే పత్తి విత్తన ప్యాకెట్లు కొని తెచ్చుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో పత్తి సాగు అధికంగా ఉండే సదాశివపేట మండలంతో పాటు అందోలు నియోజకవర్గం, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో పరిశీలించగా ఇదే విషయం తేటతెల్లమైంది. ప్రస్తుతం పత్తి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా తొలిగా విత్తనాలను తెచ్చి పెట్టుకుంటున్నారు. గత రెండు మూడేళ్లలో మంచి దిగుబడులనిచ్చిన రకాలు కావాలని డీలర్లను అడుగుతున్నారు. ఎక్కువ మంది అవే విత్తనాలు కావాలని కోరుతుండటంతో వ్యాపారుల్లో దురాశ మొదలయింది. రైతులు అడిగిన విత్తనాలు కొరత ఉన్నాయని చెబుతూ అదనపు దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక కంపెనీకి సంబంధించిన విత్తన ప్యాకెట్పై ధర రూ.850 ఉంటే, రూ.1,400కు అమ్ముతున్నారు. రూ.900పైచిలుకు ధర ఉన్న మరో విత్తన కంపెనీ ప్యాకెట్ కావాలంటే దాదాపు రూ.500 ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ సీజన్లో కొన్ని లక్షల విత్తన ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేస్తారు. ఉన్న కాస్త సమయంలోనే భారీగా వెనకేసుకునే లక్ష్యంతో డీలర్లు దందాకు తెరలేపారు.
ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని
డీలర్ల తీరుపై అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించి చర్యలు తీసుకుంటారనే నమ్మకం లేదని రైతులు పేర్కొంటున్నారు. అందుకే మంచి దిగుబడి ఇస్తాయనుకున్న పత్తి విత్తనాలు ఎక్కువ ధర పెట్టి కొనకతప్పడం లేదంటున్నారు. ప్రతి డీలరు తప్పనిసరిగా తన వద్ద ఉన్న స్టాకు వివరాలు, ధరల సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించాలి. దాని ప్రకారమే అమ్మకాలు జరపాలి. ఈ విషయంలో ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో సాగుతున్న ఈ దందాపై జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు దృష్టికి తీసుకెళ్లగా... ప్రత్యేకంగా తనిఖీ చేసి ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామన్నారు. గరిష్ట చిల్లర ధరను మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఇవ్వొద్దని ఆయన రైతులకు సూచిస్తున్నారు.
చర్యలు ఉండవనే ధీమాతోనే దోపిడీ
టి.పృథ్వీరాజ్, అధ్యక్షుడు, మంజీరా రైతు సమాఖ్య
వానానాలం సీజన్ మొదలవగానే డీలర్లకు దోపిడీకి తెరలేపారు. నేను మూడు దుకాణాలకు వెళ్లి పరిశీలించా. కొందరు రైతులనూ పంపించా. విత్తన ప్యాకెట్ మీద ఉన్న ధర కంటే కనీసం రూ.600 ఎక్కువగా తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఇది రూ.1000కి పైగానే ఉంటోంది. అధికారుల పర్యవేక్షణ అసలే లేదు. అందుకే డీలర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పక్కాగా పాటించేలా చూసి రైతులకు ఆర్థికభారం తప్పేలా చూడాలని మేం ఉన్నతాధికారులను కోరుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్