పర్యావరణ హితం.. పట్టణ ఉద్యానం
పర్యావరణానికి అత్యంత ప్రమాదకారిగా పరిణమించిన ప్లాస్టిక్, వ్యర్థాలను కట్టడి చేసి.. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తోంది నర్సాపూర్లోని పట్టణ ఉద్యానం.
లోపలికి వెళ్తున్న పర్యాటకులు
పర్యావరణానికి అత్యంత ప్రమాదకారిగా పరిణమించిన ప్లాస్టిక్, వ్యర్థాలను కట్టడి చేసి.. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తోంది నర్సాపూర్లోని పట్టణ ఉద్యానం. మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారి(765-డి)పై నర్సాపూర్లో సహజ సిద్ధమైన అడవులకు కొత్త అందాలను తీసుకువస్తూ పట్టణ ఉద్యానాన్ని రెండేళ్ల క్రితం నెలకొల్పారు. రూ.20 కోట్ల నిధులు వ్యయం చేసి 582 ఎకరాల్లో ఇనుప కంచె నిర్మాణం చేపట్టారు. పిల్లలు, పెద్దలకు వేర్వేరుగా టికెట్లు నిర్ణయించారు. లోనికి ప్రవేశించే మార్గంలోనే తనిఖీ చేసి ప్లాస్టిక్, ఆహార పదార్థాలు, సిగరెట్లు, బీడీలు వంటివి ఉంటే అనుమతించరు. తాగునీటికి ఇచ్చిన ప్రతి ప్లాస్టిక్ సీసాను రోజూ లెక్కించి మరీ వెనక్కి తీసుకుంటున్నారు. ఇద్దరు కూలీలను ఏర్పాటు చేసి లోపల ఎక్కడా పర్యావరణానికి హాని కలిగించే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. చెత్తాచెదారం మచ్చుకైనా కనిపించదు. జాతీయ రహదారి పొడవునా అటవీ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం చేపట్టారు. అడవిలో ప్లాస్టిక్ వేసిన వారికి జరిమానాలు విధిస్తామని అటవీ క్షేత్రాధికారి అంబర్సింగ్ తెలిపారు.
చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా..
న్యూస్టుడే, నర్సాపూర్:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
ద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం