దుక్కి సిద్ధం.. విత్తు పిరం
జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్ సాగు పనులు ఊపందుకున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో గతంలో వేసవి దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు వేసుకుంటున్నారు.
1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంచనా
నల్లబజారుకు డిమాండున్న విత్తనాలు
న్యూస్టుడే, గజ్వేల్, చేర్యాల:
గజ్వేల్ మండలం రిమ్మనగూడలో పత్తి విత్తనాలు నాటుతున్న మహిళలు
జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్ సాగు పనులు ఊపందుకున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో గతంలో వేసవి దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు వేసుకుంటున్నారు. ధాన్యం విక్రయాలు ఆలస్యమవటంతో సాగు పెట్టుబడి అందక వేచి చూస్తున్నామని కొందరు చెబుతున్నారు. పెట్టుబడి అందుబాటులో ఉన్న అన్నదాతలు విత్తనాలు వేస్తున్నారు. ముఖ్యంగా నల్లరేగడి భూములున్న గజ్వేల్, జగదేవపూర్, కొండపాక, మిరుదొడ్డి, చేర్యాల, చిన్నకోడూరు ప్రాంతాల్లో పత్తి విత్తుతున్నారు.
రెండో ప్రాధాన్యం పత్తికే..
వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 578700 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా 4 లక్షల ఎకరాల్లో వరి, 36 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 12500 ఎకరాల్లో కంది, 200 ఎకరాల్లో పెసర తదితర పంటలు సాగవుతాయని అధికారులు ప్రతిపాదించారు. వరి పంట సాగు చేసే రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు.
రైళ్ల ద్వారా ఎరువులు
ఈ సీజన్ మొత్తానికి 49888 టన్నుల యూరియా, 26440 టన్నుల డీఏపీ, 8277 టన్నుల ఎంఓపీ, 51884 టన్నుల కాంప్లెక్స్తో సహా మొత్తం 1,36,490 టన్నుల ఎరువులు అవసరమున్నాయని అధికారులు ప్రతిపాదించగా సరఫరా ప్రారంభించింది. గూడ్స్ రైలు ద్వారా ఎరువులు గజ్వేల్ స్టేషన్కు చేరుకున్న తరువాత అక్కడి నుంచి లారీల ద్వారా మార్కెట్యార్డులోని రేక్పాయింట్లో నిల్వ చేస్తున్నారు. వానాకాలం సీజన్లో అసౌకర్యం ఎదురుకాకుండా అన్ని విధాల చర్యలు చేపడుతున్నట్లు జిల్లా డీఏవో శివకుమార్ తెలిపారు.
కృత్రిమ కొరత
సాగు సీజన్ ప్రారంభానికి ముందే కొందరు వ్యాపారులు విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రైతులు దుక్కులు అనేక చోట్ల దుక్కులు సిద్ధం చేసుకున్నారు. విత్తనాల కోసం దుకాణాలకు వెళ్తున్నారు. ముందుగానే తెచ్చిపెట్టుకోవాలని చూస్తున్నారు. అవకాశంగా తీసుకున్న వ్యాపారులు, దళారులు సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. రెండు రకాల విత్తనాల కృత్తిమ కొరత సృష్టించి, అధిక ధరలకు కొందరు విక్రయిస్తున్నారు.
ప్యాకెట్టుకు రూ.2 వేలకు పైగా
అన్ని రకాల 450 గ్రాముల బీటీ-2 పత్తి విత్తనాల ప్యాకెట్కు ప్రభుత్వం రూ.853 ధర నిర్ణయించింది. చాలా దుకాణదారులు ప్రభుత్వ ధరకే విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు ‘సాకేత్’, ‘యూఎస్7067’ రకాల పత్తి విత్తనాలను బ్లాక్ చేశారు. దిగుబడిపై ప్రచారం చేశారు. వాటికి డిమాండు పెరిగింది. అధిక ధరకు రహస్యంగా రైతులకు అప్పగిస్తున్నారు. సాకేత్ రకం విత్తనాలకు రూ.2,100, యూఎస్7067 రకానికి రూ.1,800 వసూలు చేస్తున్నారు.
ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు
శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి, సిద్దిపేట
బీటీ-2 రకం అన్ని రకాల పత్తి విత్తనాలు ఒక్కటే. దిగుబడి సమానంగా ఉంటుంది. రైతులు వాటి కోసమే పట్టుబట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే, ఎవరినైనా సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం.
పర్యవేక్షణ లేక రెచ్చిపోతున్న డీలర్లు:
పృథ్వీరాజ్, అధ్యక్షుడు, మంజీరా రైతు సమాఖ్య
ఈనాడు, సిద్దిపేట: వానానాలం సీజన్ మొదలవగానే డీలర్లు దోపిడీకి తెరలేపారు. నేను స్వయంగా మూడు దుకాణాల్లో రైతులను పంపించి పరిశీలించా. విత్తన ప్యాకెట్ మీద ఉన్న ధర కంటే రూ.600 నుంచి రూ.1000 పైగా ధర పెంచి అమ్ముతున్నారు. అన్నదాతల అవసరాన్ని వారు వాడుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేదు. డీలర్లు రెచ్చిపోతున్నారు. కావాలనే కొరత సృష్టిస్తున్నారనేది అనుమానం. గరిష్ఠ చిల్లర ధర కంటే ఎక్కువకు అమ్మకూడదు. నిబంధనలు పక్కాగా పాటించేలా చూసి కర్షకులకు ఆర్థిక భారం తప్పేలా చూడాలని కోరుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
పార్టీ శ్రేణులతో అభ్యర్థుల అంతర్గత సమావేశాలు -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!