జీవన నైపుణ్యాలు.. భవితకు వారధులు
కౌమారదశలో విద్యార్థినులకు శారీరకం, మానసిక భావోద్వేగాలు చుట్టుముడుతాయి. ఈ దశలో సామాజికంగానూ సామర్థ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
కస్తూర్బా పాఠశాలల్లో ప్రత్యేక కరదీపికల పాఠాలు
కరదీపికలు
న్యూస్టుడే, గజ్వేల్ గ్రామీణ: కౌమారదశలో విద్యార్థినులకు శారీరకం, మానసిక భావోద్వేగాలు చుట్టుముడుతాయి. ఈ దశలో సామాజికంగానూ సామర్థ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. జీవన నైపుణ్యాలు నేర్పితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినట్లే అవుతుంది. ఆటుపోట్లను అధిగమించేందుకు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రత్యేక బోధనకు శ్రీకారం చుడుతున్నారు. వీటికి సంబంధించిన కరదీపికలు విద్యాసంస్థలకు చేరాయి.
6, 7 8 తరగతులకు
మొదట ఈ కార్యక్రమాన్ని 6, 7, 8 తరగతులు చదివే విద్యార్థినులకు అమలు చేయనున్నారు. భవిష్యత్తు పరిణామాలు అంచనా వేయడం సహచరులు, ఉపాధ్యాయులు, కుటుంబంతో అనుబంధాలపై బోధన ఉంటుంది. సాధారణంగా కేజీబీవీల్లో చదివే వారి కుటుంబాలు ఆర్థికంగా వెనుకబాటుతో ఉంటాయి. భవిష్యత్తులో ఆసక్తి ఉన్న రంగంలో నిలదొక్కుకొని నైపుణ్యాలు పెంపొందించుకునేలా అమలు చేస్తారు.
వారానికి మూడు
నూతన విద్యా సంవత్సరంలో కేజీబీవీలో వారానికి మూడు తరగతుల్లో పాఠాలు బోధించేందుకు ప్రణాళికలు రూపొందించారు. తరగతుల వారీగా ప్రత్యేక పుస్తకాలను సమగ్ర శిక్షా అధికారులు పాఠశాలలకు చేర్చారు. ఈ బోధన అమలుకు ప్రత్యేక కరదీపికలను పంపిణీ చేస్తున్నారు. త్వరలో విద్యాశాఖ అధికారులు కేజీబీవీ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
వేధింపులపై అప్రమత్తం
చాలా మంది బాలికలు లైంగిక, ఇతర వేధింపులతో పాటు హింసను ఎదుర్కొంటున్నారు. లైంగిక హింస అంటే ఏంటి? దాడులు ఎలా జరుగుతున్నాయి? వీటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు? పరిచయం లేని వారితో ఉండాల్సిన తీరు, బయటకు ఒంటరిగా వెళ్లాల్సి వస్తే ప్రవర్తించాల్సిన అంశాలపై వివరిస్తారు.
సానుకూలత, విలువల బలోపేతమే ధ్యేయం
ముక్తేశ్వరి, జీసీడీవో, సిద్దిపేట
విద్యార్థినుల్లో ప్రతికూల, ప్రమాదకర ప్రవర్తనల్ని నివారించేందుకు ప్రత్యేక బోధన ప్రణాళిక రూపొందించారు. సంపాదించిన జ్ఞానంతో, సానుకూల వైఖరి, విలువలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అంశాలు ఉంటాయి. వారి పరిపూర్ణ జీవనానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం