సంకల్పం.. సాకారం
సాధించాలనే సంకల్పం ముందు సమస్యలు ఎన్ని ఉన్నా తలవంచాల్సిందే. నిరంతరం నచ్చిన రంగంలో రాణించాలనే తపనతో పాటు, నిత్య సాధన పలువురు క్రీడాకారులను మెరికలుగా తీర్చిదిద్దుతోంది.
రాష్ట్ర స్థాయిలో రాణించిన అథ్లెట్లు
న్యూస్టుడే, సిద్దిపేట టౌన్: సాధించాలనే సంకల్పం ముందు సమస్యలు ఎన్ని ఉన్నా తలవంచాల్సిందే. నిరంతరం నచ్చిన రంగంలో రాణించాలనే తపనతో పాటు, నిత్య సాధన పలువురు క్రీడాకారులను మెరికలుగా తీర్చిదిద్దుతోంది. వేదిక ఏదైనా గెలుపే లక్ష్యంగా జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జిల్లాకు చెందిన నలుగురు అథ్లెట్లు ప్రతిభ చాటారు. గ్రామీణ నేపథ్యం కలిగిన ఈ క్రీడాకారులు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా యువ క్రీడాకారులపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం..
దేశానికి సేవ చేయాలి: ఎలుపుల కల్యాణి
ఆరవ తరగతి నుంచే పరుగు సాధన చేస్తూ శిక్షకులు ఎవరూ లేకుండా స్వయంగా అథ్లెటిక్స్లో రాణిస్తోంది సిద్దిపేట అర్బన్ మండలం గాడిచెర్లపల్లికి చెందిన ఎలుపుల కల్యాణి. 2021లో భువనగిరిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రాస్కంట్రీ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచి బంగారు పతకం సాధించింది. 2022లో కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ బంగారు పతకం పొందింది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పదివేల మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. తన శిక్షణలో కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పలువురు సైన్యానికి ఎంపికయ్యారు. వ్యాయామోపాధ్యాయుడు వెంకటస్వామిగౌడ్ ప్రోత్సాహంతో ముందుకు సాగుతోంది. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయటమే తన లక్ష్యమంటోంది కల్యాణి.
ఒలింపిక్స్లో పోటీ పడతా: గోగర్ల అభిషేక్
పేదింటి గోగర్ల అభిషేక్ తల్లిదండ్రులు సదానందం, వనిత ఇద్దరు వ్యవసాయాదారులు. అభిషేక్ గతంలో రాష్ట్రస్థాయిలో పదివేల మీటర్ల పరుగులో మూడు స్వర్ణ, రెండు రజత పతకాలు సాధించాడు. తాజాగాకాంస్య పతకం సాధించాడు. సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటస్వామిగౌడ్, శిక్షకుడు కృష్ణకుమార్ ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. ఒలింపిక్స్లోనూపోటీ పడతానని ధీమా వ్యక్తం చేశాడు.
పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యం: తలారి కల్పన
రాయపోల్కుచెందిన తలారి కల్పన చిన్ననాటి నుంచే పరుగులో దిట్ట. తల్లి వినోద వ్యవసాయం చేస్తూ ఒక్కగానొక్క కూతురు కల్పనను చదివిస్తున్నారు.అథ్లెటిక్స్పై దృష్టి సారించి పరుగుపందెంపై శిక్షణ తీసుకుంటుంది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 1500 మీటర్ల పరుగులో కాంస్య పతకంతో మెరిసింది. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ పరీక్షలో సైతం అర్హత సాధించింది.
జాతీయ స్థాయిలో రాణిస్తా: తొడంగి అశ్విని
రాయపోలు మండలం తిమ్మక్కపల్లికి చెందిన తొడంగి అశ్విని ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో హైజంప్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. అమ్మా నాన్న అంజయ్య, అరుణ ఇద్దరు రైతులే. అశ్విని పదో తరగతి దుబ్బాక ఏంజేపీలో చదివింది. వర్గల్ ఎంజేపీలో ఇంటర్ పూర్తిచేసిన అశ్విని జాతీయస్థాయి హాకీలో పతకం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
చలాకీ బాలిక
మిరుదొడ్డి: దుబ్బాక మున్సిపాటీ పరిధి లచ్చపేటకు చెందిన బాలకిషన్ అరుణ కుమార్తె వర్షిణి పరుగుల రాణిగా పేరు తెచ్చుకుంది. మిరుదొడ్డి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాటు తల్లిదండ్రుల సాయంతో నిత్యం వ్యాయామం చేస్తోంది. ప్రతి రోజు తండ్రి బాలకిషన్తో కలిసి ఐదు కి.మీ. పరుగును సాధన చేసింది. ఇటీవల సిద్దిపేట సీపీ శ్వేత ఆదేశాల మేరకు రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఠాణాలో ఐదు కి.మీ. పరుగు పందేలు నిర్వహించారు. బాలిక వర్షిణి మిరుదొడ్డి, దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్ పలు చోట్ల ఐదు కి.మీ. పరుగును పూర్తి చేసి పోలీసు అధికారుల మెప్పు పొందింది. చిన్నారికి మెరుగైన శిక్షణతో పాటు సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని శిక్షకులు పేర్కొంటున్నారు. రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాపురెడ్డి బాలిక పరుగుకు కావాల్సిన బూట్లతో పాటు వసతుల కల్పనకు సాయం చేస్తున్నారు. మిరుదొడ్డి గ్రామానికి చెందిన నాగేశ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కమలాకర్రెడ్డి రూ.5 వేల నగదు అందజేసి ప్రోత్సహించారు.
పోటీదార్లతో పరుగెడుతున్న బాలిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!